Spread the love

చిలుకూరు మండల పరిధిలో
ఎస్పీ కె నరసింహ ఐపిఎస్ ఆదేశాల మేరకు చిలుకూరు ఎస్సై రాంబాబు , మండల కేంద్రంలోని మిట్స్ ఇంజనీరింగ్ కళాశాల లో షీ టీమ్స్, సైబర్ నేరాలపైన, గంజాయి, డ్రగ్స్ మత్తుమందులు, అన్ లైన్ బెట్టింగ్ లపై పోలీసు కళాభృందంతో విద్యార్థినిలకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగినది.
ఎస్సై రాంబాబు మాట్లాడుతూ జిల్లా ఎస్పీ కె నరసింహ ఐపిఎస్ అధ్వర్యంలో షీ టీమ్స్, సైబర్ నేరాలపై, గంజాయి డ్రగ్స్ మత్తు మందులు, ఆన్ లైన్ బెట్టింగ్, గుట్కాపై పటిష్టంగా పనిచేస్తున్నామని తెలిపారు. ప్రతి గ్రామంలో, స్కూల్లో, కళాశాలలో చదువుకునే విద్యార్థులు, యువతి యువకులు ఇంటర్నెట్ ను సద్వినియోగం చేసుకోవాలి, సైబర్ మోసగాళ్ళ వల్ల మోసాలకు గురి కావద్దు, బ్యాంక్ ఖాతా, ఎటీఏం కార్డ్ వివరాలు, ఒటీపి వివరాలు ఇతరులకు తెలపవద్దు, ఇతరులు ఆశ చూపితే వాటికి ఆకర్షితులు కావొద్దు. మెసేజ్ లలో వచ్చే బ్లూ లింక్ అనుసరించి వ్యక్తిగత వివరాలు నమోదు చేయవద్దు అని కోరినారు. సైబర్ మోసాలపై1930 టోల్ ఫ్రీ నంబర్ కు పిర్యాదు చేయాలని అన్నారు. అలాగే రోడ్డు నియమ నిబంధనలు తెలుసుకోవాలని అతివేగం ప్రయాణించవద్దు అని వేధింపులపై100కు సమాచారం ఇవ్వాలని తెలిపినారు.

ఆడపిల్లలు మహిళలు ఆకతాయిలా వేధింపులకు గురైనట్లయితే షీ టీం నెంబర్ 8712686056 ఫిర్యాదు చేయవచ్చు అన్నారు.
వ్యక్తిగత సమాచారం, బ్యాంకు వివరాలు, ఏటీఎం పిన్ నెంబర్లు, సోషల్ మీడియాలో బహిర్గతం చేయొద్దన్నారు. వ్యక్తిగత ఫోటోలను డిపి లుగా పెట్టుకోవద్దని చెప్పారు.మొబైల్ యాప్ లలో వచ్చేటువంటి అనవసరమైన బ్లూ లింకులను క్లిక్ చెయ్యొద్దు అని తెలిపారు. యువత చెడు వ్యసనాల బారిన పడొద్దు అన్నారు.గంజాయి మత్తుమందులకు సంబంధించిన సమాచారం ఎవరికైనా తెలిస్తే తప్పకుండా పోలీస్ వారికి సమాచారం ఇవ్వాలని తెలియజేశారు
యువత లోన్ యాప్ లకు దూరంగా ఉండాలన్నారు. సామాజిక మాధ్యమాలకు రక్షణగా బలమైన పాస్వర్డ్లు పెట్టుకోవాలని అన్నారు
అనంతరం పోలీసు కళబృందం వారు చక్కటి సాంస్కృతిక, పాటలతో విద్యార్థినిలకు అవగాహన కల్పించారు
ఈ కార్యక్రమం నందు చిలుకూరు మిట్స్ కళాశాల ప్రిన్సిపల్ కేశవరెడ్డి, వైస్ ప్రిన్సిపల్ నర్సిరెడ్డి, పోలీస్ సిబ్బంది హెడ్ కానిస్టేబుల్ జ్యోతీ, కోదాడ షీ టీం మహిళా కానిస్టేబుల్ సాయి జ్యోతి, కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు, కళాబృందం ఇంచార్జ్ యల్లయ్య, గోపయ్య,చారి, మరియు ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు, విద్యార్థినిలు పాల్గొన్నారు.