TEJA NEWS

ప్రాథమిక దశలో గుర్తిస్తే క్యాన్సర్ నివారణ సాధ్యం
బాలాయపల్లి వైద్యాధికారి డాక్టర్ లియోన

తిరుపతి: ప్రాథమిక దశలో క్యాన్సర్ ను గుర్తిస్తే పూర్తిగా నివారణ సాధ్యమవు తుందని బాలాయపల్లి వైద్యాధికారి డాక్టర్ లియోన తెలిపారు. తిరుపతి శ్రీ వేంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ(స్విమ్స్) ఆధ్వర్యంలో గురువారం బాలాయపల్లి పిహెచ్ సి పరిధిలోని నిండలి, గొట్టికాడు గ్రామాల్లో పింక్ బస్సుల ద్వారా ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ సహకారంతో తిరుపతి జిల్లాలో రెండు పింక్ బస్సుల ద్వారా మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ వేగవంతంగా జరుగుతోంది. బిపి, షుగరు పరీక్షలతోపాటు పింక్ బస్సులో మహిళలు, పురుషులకు నోటి క్యాన్సర్ పరీక్షలు, మహిళలకు రొమ్ము క్యాన్సర్ నిర్ధారణకు మామోగ్రామ్, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నిర్ధారణ కోసం పాప్ స్మియర్ పరీక్షలను ఉచితంగా నిర్వహించారు. మహిళలు, పురుషులు విశేషంగా విచ్చేసి క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకున్నారు.

పింక్ బస్సుల క్యాంపులు జరిగే ప్రదేశాలు..

జూన్ 2న జయంపు, పెరిమిడి.

జూన్ 3న కామకూరు, పిగిలం.

జూన్ 5న కాట్రగుంట, ఊట్లపల్లి.

జూన్ 6న కయ్యూరు, విఎం.పురం.

జూన్ 9న కోటంబేడు.

స్విమ్స్ డైరెక్టర్ కమ్ వైస్ చాన్సలర్ డాక్టర్ ఆర్వీ కుమార్ ఆదేశాల మేరకు కమ్యూనిటి మెడిసిన్ విభాగాధిపతి డాక్టర్ కె.నాగరాజ్ పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమాల్లో స్విమ్స్ మెడికల్ ఆఫీసర్లు డాక్టర్ హరిత, డాక్టర్ చైతన్య భాను, సర్పంచులు కృష్ణయ్య, సుప్రజ, పంచాయతీ కార్యదర్శులు దయాకర్, మౌలా, స్థానిక నాయకులు మీరారెడ్డి, శేఖర్, గోపికృష్ణారెడ్డి, సిహెచ్ఓ బి.నీరజ, సూపర్వైజర్ టివి.నరసింహారావు, ఎంఎల్ హెచ్ పిలు ఎ.నాగరవళి, సి.భానుప్రియ, ఏఎన్ఎంలు జి.వసుంధర, సుబ్బమ్మ, స్థానిక వైద్య సిబ్బంది, ఆశా వర్కర్లు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.