
లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేసిన నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కొలన్ హన్మంత్ రెడ్డి ||
కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ బాచుపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అనారోగ్యంతో బాధపడుతూ వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందిన పలువురు పేదలకు ముఖ్యమంత్రి సహా నిధి ద్వారా మంజురైన బాధితులకు రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ద్వారా శస్త్ర చికిత్స నిమిత్తం రూ. 60,000/- , ల సీఎం సహాయనిధి నుండి (CMRF) ని మంజూరి చేయించిన కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కొలన్ హన్మంత్ రెడ్డి . బాచుపల్లి , కొంపల్లి మున్సిపాలిటీ, నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్, 132, 131, 128, 127 డివిజన్ల లోని చెందిన వాసులు వెంకటేష్ గౌడ్ , ఆవుల సత్తి రెడ్డి, అనిరుద్ లాల్, ఆవుల శోభ, శారదా, గోపాల రావు,ఊరడి రాములు, అన్నపూర్ణ, కులకర్ణి ప్రవీణ కు రూ. 60,000/- మరియు రుషి రాజ్ కి రూ. 39,000/- CMRF-మంజూరి పత్రాలను (చెక్కులు) అందజేశారు.
అనంతరం హన్మంతన్న మాట్లాడుతూ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల ద్వారా ఎంతో మేలు చేకూరుతుందని అలాగే అనారోగ్యం బారిన పడిన ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని,పేద ప్రజల సంక్షేమ ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందని ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో డీసీసీ ఉపాధ్యక్షులు ధమ్మని శ్రవణ్ కుమార్, నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులు కోలన్ రాజశేఖర్ రెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు కోలన్ వీరేందర్ రెడ్డి, బేకు శ్రీనివాస్, కందాడి సుదర్శన్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, కోలన్ జీవన్ రెడ్డి, ప్రసన్న కుమార్, జెస్సి పాల్, రాజి రెడ్డి, టేకుల ప్రవీణ్ రెడ్డి, వెంకటేష్, గోపాల్ రావు, కాయుమ్ పషా, తిరుపతి, మోహన్ మరియు తదితరులు పాల్గొన్నారు.
