
పరిహారం చెల్లించి రోడ్డు వెడల్పు చేపట్టాలి…………………
బిజెపి రాష్ట్ర నాయకులు సీనియర్ న్యాయవాది మున్నూరు రవీందర్
వనపర్తి జిల్లాల్లో వివిధ ప్రాంతాల్లో చేపడుతున్న రోడ్డు వెడల్పు పనులలో నివాసం ఉంటున్న ఇండ్లు విలువైన ప్లాట్లు.కోల్పోతున్న బాధితులకు భూ సేకరణ చట్టం ప్రకారం నష్టపరిహారం చెల్లించాలని ఆ తర్వాతనే పనులు ప్రారంభించాలని బిజెపి రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు సీనియర్ న్యాయవాది మున్నూరు రవీందర్ డిమాండ్ చేశారు. గతంలో కూడా ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్న టిఆర్ఎస్ ప్రభుత్వం వనపర్తి జిల్లా కేంద్రంలో చేపట్టిన రోడ్డు వెడల్పు పనులు అస్తవ్యస్తంగా దౌర్జన్యంగా బెదిరిస్తూ ఎలాంటి నష్టపరిహారం చెల్లించకుండా బాధితులకు పునరావసం కల్పించకుండా రోడ్డు వెడల్పు చేశారని ఆయన ఆరోపించారు. రాజ్యాంగం కల్పించిన చట్టాలు ఉన్నప్పటికీ ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి చట్టాలు చుట్టాలుగా మారుతున్నాయని ప్రభుత్వాలకు జిల్లా అధికార యంత్రాంగం కూడా వత్తాసు పలుకుతూ చట్టాలను నిర్వీర్యం చేస్తుందని ఆయన తీవ్ర స్థాయిలో విమర్శించారు. వనపర్తి జిల్లా కేంద్రంలో చేపట్టిన రోడ్డు వెడల్పు పనులు ఇప్పటికీ పూర్తి కాలేదని అందువల్లనే పట్టణంలో ట్రాఫిక్ సమస్యతో పాటు ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. వనపర్తి లో చేపట్టిన రోడ్డు వెడల్పు పనుల మాదిరిగానే పెబ్బేరు మండల కేంద్రంలో కూడా రోడ్డు వెడల్పు పనులు చేపట్టడానికి జిల్లా అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారని పెబ్బేరు మండల కేంద్రంలో కూడా రోడ్డు వెడల్పు బాధితులకు ముందుగా పరిహారం చెల్లించి రోడ్డు వెడల్పు పనులు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు.
జీవో నెంబర్ 200 ప్రకారం రోడ్డు వెడల్పులో నష్టపోయిన బాధితులకు పరిహారం ఇవ్వాలని భూసేకరణ చట్టం 2013 ప్రకారం పరిహారం ఇవ్వాలని నిబంధనలు ఉన్నాయని ఆయన అన్నారు. సరియైన పరిహారం చెల్లించకుండా పౌరుల నుండి భూమిని సేకరించే అధికారం ప్రభుత్వాలకు లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసిందని ఆయన పేర్కొన్నారు. ఆస్తి హక్కు ఇప్పటికీ రాజ్యాంగపరమైన హక్కుగా గుర్తించిందని పరిహారం ఇవ్వకుండా ప్రభుత్వాలు భూసేకరణ చెల్లదంటూ రోడ్డు వెడల్పు కోసం సేకరించవలసిన భూమికి గాను పరిహారం చెల్లించాలని సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిందని కూడా ఆయన అన్నారు. భూ సేకరణ చట్టం ఎల్ ఏ ఆర్ ఆర్ 2013 ప్రకారం భారతదేశంలో ఈ చట్టం అమలయిందని భూ యజమానుల హక్కులను రక్షించడం వారి ఆస్తి భూమి వంటి విలువైన ఆస్తులకు న్యాయమైన పరిహారం పొందేలా చూడాలనే లక్ష్యంతో ఈ చట్టం రూపొందించారని పేర్కొన్నారు. ప్రజా ప్రయోజనాల కోసం భూసేకరణ ప్రక్రియ నియంత్రించడానికి భారత పార్లమెంటు భూ సేకరణ చట్టాన్ని రూపొందించింది అని కూడా ఆయన అన్నారు. భూముల కొరకుతున్న యజమానులకు ఇల్లు స్థలాలు ఇండ్లు ఇతర ఆస్తులు కోల్పోతున్న బాధితులకు నష్టపరిహారంతో పాటు ఇతర ప్రాంతాలలో పురాణవాసం కల్పించాలని ఆదేశాలు స్పష్టంగా ఉన్నప్పటికీ రోడ్డు వెడల్పు పనులలో నష్టపోయిన బాధితులకు నష్టపరిహారం ఇవ్వకుండా ఎలాంటి పునరావాసం కల్పించకుండా మొక్కుబడిగా గత ప్రభుత్వం నష్టపోయిన బాధితులను నరకం చూపిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బాధితులకు భరోసా ఇవ్వవలసిన ప్రభుత్వాలు బాధ్యతను విస్మరించి బెదిరిస్తుందని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇప్పటికైనా వనపర్తి జిల్లాలో ప్రస్తుతం పెబ్బేరు మండల కేంద్రంలో చేపట్టడానికి చేస్తున్న రోడ్డు వెడల్పు కంటే ముందే పరిహారం చెల్లించాలని గతంలో వనపర్తిలో నష్టపోయిన రోడ్డు వెడల్పు బాధితులను అన్ని రకాల ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకొని చట్టాలను అమలు చేయాలని ఆయన సూచించారు.
