TEJA NEWS

గ్రేటర్ వరంగల్ 10 వ డివిజన్, హన్మకొండ

వరంగల్ పశ్చిమ నియోజక అభివృద్దే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం.. నాయిని రాజేందర్ రెడ్డి…

హన్మకొండ 10వ డివిజన్ లొని చిలీ బజార్ మరియు నబీ ఖాన వద్ద డివిజన్ లో 75 లక్షలతో రోడ్లు మరియు డ్రైనేజ్ పనులకు వరంగల్ పశ్చిమ శాసన సభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి, కార్పోరేషన్ ఫ్లోర్ లీడర్ తోట వెంకటేశ్వర్లు శిలా ఫలకాన్ని ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా నాయిని రాజేందర్ రెడ్డి మాట్లడుతూ …

గత బిఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఎలాంటి అభివృద్ధికి నోచుకోని 10వ డివిజన్ ని కాంగ్రెస్ అధికారం చేపట్టిన కొన్ని డివిజన్లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని ఇకముందు కూడా ఇంకెన్నో అభివృద్ధి పనులను చేపట్టబోతున్నామని అన్నారు.

పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం నడుస్తుందని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు

దశల వారిగా అన్ని వార్డులలో సైడ్ డ్రైన్, సీసీ రోడ్ల పనులను చేస్తున్నామని రోడ్డు నిర్మాణ పనుల్లో స్థానిక కాలనీ వాసులు ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. కాలనీలలో ఎటువంటి సమస్యలు ఉన్న నా దృష్టికి తీసుకువస్తే వీలైనంత త్వరలో పరిష్కారం చేస్తానని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో గ్రేటర్ వరంగల్ కు మరిన్ని నిధులు తీసుకొచ్చి వరంగల్ పశ్చిమ నియోజకవర్గాన్ని అభివృద్ధి పరుస్తానని అన్నారు.

అనతరం మత్య శాఖ సొసైటీ హన్మకొండ అధ్యక్షులు కత్తెర సారంగపాణి ఆధ్వర్యంలో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే శ్రీ నాయిని రాజేందర్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి మెమొరండం ఇవ్వడం జరిగింది.

ఈ కార్యక్రమంలో 7 వ డివిజన్ కార్పొరేటర్ వేముల వాసు , డివిజన్ అధ్యక్షుడు శోభన బోయిన కుమార్ యాదవ్ ex. కార్పొరేటర్ నజీమ్ జిహాన్, నజీర్ బాయ్, గంగు ఉపేంద్ర శర్మ, అంబటి మహేందర్, పల్లం రమేష్, మాడిశెట్టి సతీష్, బొంత రాఘవులు, జాఫర్ ఖాన్ , షేక్ యాకూబ్, సంపతి కృష్ణ, ఇతర కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, డివిజన్ వాసులు పాల్గొన్నారు