TEJA NEWS

ఎస్టివి నగర్ లో పింఛన్లు పంపిణీ

తిరుపతి: ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని శనివారం మున్సిపల్ పాలకులు, అధికారులు పరిశీలించి పంపిణీ చేశారు. ఇందులో నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్.మౌర్య, రాష్ట్ర యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్, డిప్యూటీ మేయర్ ఆర్.సి.మునికృష్ణ, డిప్యూటీ కమిషనర్ అమరయ్యలు ఎస్టివి. నగర్ లో భరోసా పింఛన్ల పంపిణీ చేపట్టారు. సీఎం చంద్రబాబు నాయుడు అవ్వ, తాతలకు పింఛన్ పెంచి ఇస్తుండడం వల్ల అంతా హ్యాపీగా ఉన్నారని డిప్యూటీ మేయర్ ఆర్.సి. మునికృష్ణ తెలిపారు. అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం పనిచేసే పార్టీ టీడీపీ కూటమి ఒక్కటేనని తెలిపారు.