
ప్రభుత్వ ఆసుపత్రి లో జిల్లా కలెక్టర్ సతీమణి కాన్పు
పాల్వంచ వైద్య విధాన పరిషత్ ఆసుపత్రి లో పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జీతేష్ వి పాటిల్ సతీమణి శ్రద్ధ జీతేష్ వి పాటిల్. తల్లీ, బిడ్డ ఆరోగ్యంగా ఉన్నారు. తొలి కాన్పులో కూడా మగ బిడ్డ..
చాలకాలం గా పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రి లొనే పరీక్షలు చేయించుకుంటున్న కలెక్టర్ సతీమణి. పర్యవేక్షించిన డి సి హెచ్ ఎస్ డాక్టర్. రవిబాబు.
ప్రభుత్వ వైద్యం పై నమ్మకం పెంచిన కలెక్టర్ చర్య.కార్పొరేట్, ఇతర పెద్ద హాస్పిటల్స్ ను వదిలి కేవలం సి హెచ్ సి లో కాన్పు చేయించుకోవడం తో ప్రభుత్వ వైద్యం లో కింద స్థాయి వరకు ఎలా బలోపేతం అయ్యాయో ఈ సంఘటన రుజువు చేస్తుంది..
