
TTDకి రూ. కోటి విరాళం
TTDకి రూ. కోటి విరాళం
తిరుమల తిరుపతి దేవస్థానంలోని వివిధ ట్రస్టులకు భక్తుల నుండి విరాళాలు అందుతున్నాయి. ఒడిశాకు చెందిన శివమ్ కాండేవ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ టీటీడీలోని వివిధ ట్రస్టులకు మొత్తం రూ.80 లక్షల విరాళంగా అందించింది. అదే రాష్ట్రానికి చెందిన బలభద్ర డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ రూ. 20 లక్షలు విరాళంగా ఇచ్చింది. ఈ మేరకు దాతలు డీడీలను TTD ఈవో ధర్మారెడ్డికి అందజేశారు.
