TEJA NEWS

నయీం కేసులో దూకుడు పెంచిన ఈడీ

నయీంకు సంబంధించి 35 ఆస్తులు జప్తు చేసేందుకు ఈడీ చర్యలు.35 ఆస్తులను నయీం కుటుంబ సభ్యులు, సన్నిహితుల పేర్ల మీద రిజిస్ట్రేషన్ చేసినట్లు గుర్తించిన ఈడీ. అక్రమంగా ఈ ఆస్తులను నయీం, తమ కుటుంబ సభ్యుల పేర్ల మీద రిజిస్టర్ చేసినట్లు ఈడీ గుర్తింపు. 2022 మార్చిలో నయీం ఆస్తుల పై మనీ లాండరింగ్ కేసు నమోదు చేసిన ఈడీ. నాటి ఐటీ అధికారులు, సిట్ సమాచారంతో ECIR నమోదు. ECIRలో నయీం కుటుంబ సభ్యుల పేర్లను చేర్చిన ఈడీ. నయీం పై ఫిర్యాదు చేసిన భువనగిరిలోని క్రిస్టియన్ గోస్పెల్ మిషన్ సెక్రటరీ ప్రభాకర్. రూ. కోట్ల ఆస్తులు సంపాదించినా ITR ఫైల్ చేయని నయీం కుటుంబసభ్యులు.