TEJA NEWS

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు అర్హత పత్రాలు అందజేత

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గం

అశ్వరావుపేట నియోజకవర్గం పేద ప్రజల ఇంటికలను ఎమ్మెల్యే జారే ఆదినారాయణ నెరవేర్చారని దమ్మపేట మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు పర్వత నేని వరప్రసాద్ అన్నారు. మందలపల్లి గ్రామపంచాయతీ లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల అర్హత పత్రాలను అందజేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రజా పాలన ప్రభుత్వంలో పేదలందరికీ ఇళ్లు నిర్మించడం జరుగుతుందన్నారు. అర్హత పత్రాలు అందుకున్న లబ్ధిదారులు ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెప్పారు