
20న ఏపీ బడ్జెట్ సమావేశాల ముగింపు!
అమరావతి :
ఏపీలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈనెల 20న ముగిసే అవకాశం ఉంది. ఎస్సీ వర్గీకరణ అంశంపై అదేరోజున సభలో చర్చ చేపట్టనున్నారు. ఈనెల 21న సమావేశాలు నిర్వహించాలని గత నెలలో నిర్వహించిన శాసనసభ వ్యవహారాల సలహా కమిటీ భేటీలో నిర్ణయించారు. ఇప్పుడు దానికి ఒకరోజు ముందే ముగిసే అవకాశం ఉంది. నేడో రేపో దీనిపై స్పష్టత ఇవ్వనున్నారు.
