TEJA NEWS

వనపర్తి జిల్లాను ముత్తు జిల్లాగా మార్చడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు
అన్నారు

వనపర్తి
వనపర్తి జిల్లాను మత్తు పదార్థాల (నషాముక్తి )జిల్లాగా మార్చేందుకు ప్రతి ఒక్కరు తమ వంతు కృషి చేయాలని అదనపు కలెక్టర్ రెవెన్యూ జి. వెంకటేశ్వర్లు అన్నారు.
ప్రజావాణి హాల్లో జరిగిన జిల్లా స్థాయి నార్కోటిక్, నషాముక్త్ భారత్ సమీక్ష సమావేశంలో అదనపు కలెక్టర్ పలు సూచనలు చేశారు.
మత్తు పదార్థాల సేవించడం వల్ల జరిగే అనర్థాల పై యువతకు అవగాహన కల్పించాలని, విద్యా శాఖ అధికారులతో పాటు తల్లిదండ్రులు బాధ్యత తీసుకోవాలని సూచించారు. పోలీస్ అధికారులు గట్టి నిఘా పెట్టీ గంజాయి రవాణా, సేవించే వారిని అరికట్టాలని సూచించారు. ఒకప్పుడు పట్టణ ప్రాంతానికి పరితమైన గంజాయి వాడకం గ్రామీణ ప్రాంతానికి పాకుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ ఇన్చార్జి యాదయ్య మాట్లాడుతూ తమ పిల్లలు మత్తుపానియాల బారిన పడకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని, పిల్లలపై ఒక నిఘావేసి ఉంచాలని కోరారు. విద్యాలయాలు, ఆసుపత్రులకు 100 మీటర్ల పరిధిలో పాన్, గుట్కా, సిగరెట్ వంటి పదార్థాలు అమ్మకుండా పోలీస్ అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు.
స్పెషల్ క్యాంపెయిన్ లు నిర్వహించి యువతకు అవగాహన కల్పించాలని సూచించారు. అదేవిధంగా పాఠశాలలు, కళాశాలల ఆవరణలో మత్తు పదార్థాలు సేవించడం వల్ల జరిగే అనర్థాల పై ఫ్లెక్సీ లు కట్టి అవగాహన కల్పించాల్సిందిగా జిల్లా సంక్షేమ శాఖ అధికారిని ఆదేశించారు.
డి.సి.ఆర్.బి. డి.ఎస్పీ ఉమామహేశ్వర రావు మాట్లాడుతూ జిల్లాలో 2017 నుంచి గంజాయి కేసులు నమోదు అవుతున్నాయని, ఇటీవల వీపనగండ్ల మండలంలో ఒక పశువుల కాపరి గడ్డి వాములో గంజాయి దాపెట్టి ఉంచిన ఉదంతం వచ్చిందన్నారు.
గంజాయి సేవించే వారు, రవాణా చేసే వారి పై పోలీస్ శాఖ గట్టి నుఘావేసి ఉంచిందని దొరికిన వెంటనే కేసులు బుక్ చేసి జైలుకు పంపిస్తున్నట్లు తెలియజేశారు.
జిల్లా సంక్షేమ అధికారి సుధారాణి, పి.డి. డీఆర్డిఒ ఉమాదేవి, ఆబ్కారీ శాఖ, విద్యా శాఖ అధికారులు, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.