TEJA NEWS

జూరాల కుడి కాలువ కు నీటిని విడుదల చేసిన గద్వాల ఎమ్మెల్యే

*కృష్ణమ్మ కు ప్రత్యేక పూజలు చేసి ఎమ్మెల్యే

గద్వాల నియోజకవర్గం ధరూర్ మండల పరిధిలోని ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు కుడికాలువ కు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి చేతుల మీదుగా ప్రత్యేక పూజలు నిర్వహించి సాగు నీరు విడుదల చేయడం జరిగినది.

ఎమ్మెల్యే మాట్లాడుతూ……*

18 సంవత్సరాల తర్వాత ఈ సంవత్సరం ముందస్తు వర్షాలు రావడంతో నీటిని తొందరగా విడుదల చేయడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా ఏరువాక పూర్ణిమ పండుగ అప్పుడు నీటిని విడుదల చేసేవారు అప్పట్లో పెద్దలు ఏరు ముందా నీరు ముందా అని మాటను ఎక్కువగా చెప్పేవారు. కానీ ఈ సంవత్సరం అధికంగా ముందస్తుగా వర్షపాతం నమోదు కావడంతో జూరాల ప్రాజెక్ట్ కుడి కాలువ ద్వారా నీళ్లు విడుదల చేయడం వల్ల రైతుల ముఖాల్లో సంతోషం కనిపిస్తుందని పేర్కొన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఆర్థికంగా అభివృద్ధి చెందాలని నిరంతరం కృషి చేయడం జరుగుతుంది. గద్వాల నియోజకవర్గం రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా రెండు పంటలకు సాగునీరు ను అందించడం జరిగింది. రైతులు పండించిన వరి ధాన్యమును ప్రభుత్వమే కొనుగోలు చేయడం జరిగింది వెంటనే వారి ఖాతాలో డబ్బులను కూడా జమ చేయడం జరిగింది. అదేవిధంగా మరొకసారి రైతులు పంట వేసుకోవడానికి సిద్ధమవుతూ ఆ సందర్భంలోనే ముందస్తుగానే వర్షాలు రావడంతో రైతులకు రెండు పంటలకు సరిపడే చివరి ఆయకట్టు వరకు సాగునీరును అందించడానికి విధంగా నీటిని విడుదల చేయడం జరిగింది. దీని ద్వారా రిజర్వాయర్లు కాలువలకు చెరువులకు కు నీటిని అందించడం జరుగుతుంది.

ఏ ప్రభుత్వాలు వచ్చిన రైతుల సంక్షేమం కోసం కృషి చేయడం జరుగుతుంది. కావున రైతులు ఇబ్బందిలు అపోహాలు చెందవద్దండి అన్ని విధాలుగా ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం కృషి చేయడం జరుగుతుందని తెలిపారు.

నారాయణపూర్ డ్యామ్ గరిష్ఠ స్థాయికి చేరుకోనుంది. దీంతో డ్యామ్ గేట్లు ఎత్తి దిగువన జూరాలకు నీటిని విడుదల చేయనున్నారు.

గద్వాల జిల్లా రైతాంగం కు లక్ష ఎకరాలు వరకు సాగునీరు రైతులకు పుష్కలంగా అందించడం జరుగుతుంది. రైతులు పంటను పండించుకోవడానికి నీటిని విడుదల చేయడం జరిగింది, కావున రైతులు నీటిని వృధా చేయకుండా క్రమ పద్ధతిలో వాడుకోవాలని సూచించారు.

నడిగడ్డలో ప్రతి ఎకరాకు సాగునీరందిస్తామన్నారు. జూరాలకు వస్తున్న వరద నీటిని దృష్టిలో ఉంచుకుని నెట్టెంపాడు ఎత్తిపోతల ద్వారా ర్యాలంపాడు, గూడెందొడ్డి పంపు మోటార్లు ఇప్పటికే ఆన్ చేశామని, రిజర్వాయర్ల ద్వార కాలువలకు సాగు నీరు వదలడం జరుగుతుందన్నారు.

ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీ చైర్మన్ బండారి భాస్కర్ జిల్లా గ్రంథాలయ మాజీ ఛైర్మన్ జంబు రామన్ గౌడు జిల్లా పార్టీ సీనియర్ గడ్డం కృష్ణారెడ్డి పటేల్ ప్రభాకర్ రెడ్డి, మాజీ సర్పంచ్ శివారెడ్డి, నాయకులు వెంకటేశ్వర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, రఘువర్ధన్ రెడ్డి, ప్రభాకర్ గౌడ్, భగీరథ వంశీ, ఈశ్వర్, పవన్ రెడ్డి, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.