
చిలకలూరిపేట పురపాలక సంఘ కార్యాలయంలో భారీ స్థాయిలో అవినీతి చేసిన గంగ భవాని అంశం పై దద్దరిల్లిన కౌన్సిల్
గంగ భవాని అవినీతి పై వాడివేడిగా జరిగిన చర్చ
టీడీపీ, వైస్సార్సీపీ కౌన్సిలర్ ల మధ్య మాటల యుద్ధం
ఒక ఔట్సోర్సింగ్ ఉద్యోగి చేతివాటం కు 15మంది పర్మినెంట్ ఉద్యోగులు అడ్డంగా బలైయ్యారని, వారి జీవితాలు రోడ్డు న పడ్డాయని, దీనికి కారణం మాజీ మంత్రి రజిని ,విడదల గోపి అని 10వ వార్డ్ కౌన్సిలర్ బేరింగ్ మౌలాలి ఆరోపించారు.
ఈ విషియం పై వైస్సార్సీపీ కౌన్సిలర్ వలేటి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ…. బేరింగ్ మౌలాలి ఆరోపించిన ఆరోపణలు పై సరైనవి కాదని…. ఉద్యోగి గంగ భవాని చేసిన అవినీతి కి మాజీ మంత్రి రజీని,గోపి కి ఏంటి సంబంధం అని ప్రశ్నించారు.
దీంతో వైస్సార్సీపీ, టీడీపీ కౌన్సిలర్ ల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వివాదం చోటుచేసుకుంది.
అవినీతి జరగలేదని నిరూపిస్తే రాజీనామా చేసేందుకు సిద్ధమని కౌన్సిలర్ బేరింగ్ మౌలాలి ఘంటా పదంగా సభ లో అనడంతో…. కౌన్సిల్ సభ దద్దరిల్లింది.సభ లో వాదోపవాదాలు పెరిగాయి.
మున్సిపల్ కార్యాలయంలో జరిగిన అవినీతి కి ,నాకు ఎటువంటి సంబంధం లేదు-మున్సిపల్ చైర్మన్ రఫాని
దైవ సాక్షిగా ఖురాన్ పై ప్రమాణం చేసి చెపుతున్నా-చైర్మన్
అవినీతి నాకు తెలిసి జరిగిందని నిరూపిస్తే ఎలాంటి చర్యలు కైనా సిద్ధం-చైర్మన్ రఫాని
గందరగోళం, వాదోపవాదాలు, మధ్య దద్దరిల్లిన మున్సిపల్ కౌన్సిల్ సమావేశం
చైర్మన్ మాట్లాడుతూ ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు తమని చైర్మన్ గా కొనసాగమని చెప్పారని, అవినీతిలో తన పాత్ర లేదని, కావాలనే కొంతమంది దురుద్దేశంతో ఆపాదించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని, దైవ సాక్షిగా ప్రమాణం చేయడానికి సిద్ధమని చెప్పి బెల్లు కొట్టి సభను ముగించారు. అజెండాలోని 21 అంశాలనుకౌన్సిల్ ఆమోదించింది
