
దేశంలో అలజడులు సృష్టించేలా మెసేజ్ ఫార్వర్డ్ చేస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవు.-జిల్లా ఎస్పీ శ్రీ ఆర్.గంగాధరరావు, ఐపిఎస్.,
పాకిస్తాన్ పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో ఉద్వేషపూరితమైన సమాచారాన్ని సామాజిక మాధ్యమాల వేదికగా షేర్ చేసిన, పోస్ట్ చేసిన ఆడియో, వీడియో మెసేజ్ ల రూపంలో గ్రూపుల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యవహరించిన అటువంటి వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.
▪️ఏదైనా మెసేజ్ ఫార్వర్డ్ చేసేముందు అది వాస్తవమైనదా కాదా నిర్ధారణ చేసుకున్న పిమ్మట గ్రూపుల్లో షేర్ చేయాలి. అలా కాకుండా మెసేజ్లను ఫార్వర్డ్ చేస్తే గ్రూప్ అడ్మిన్లే బాధ్యత వహించాల్సి ఉంటుంది.
▪️అలా కాకుండా పోలీస్ వారి ఆదేశాలను మీరి అవాస్తవమైన, విద్వేషపూరితమైన మెసేజ్లను, ఆడియో, వీడియోలను షేర్ చేస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడానికి ఏమాత్రం వెనకాడము.
శ్రీ ఆర్.గంగాధరరావు ఐపీఎస్,
సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, కృష్ణాజిల్లా.
