అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన ఎమ్మెల్యే జారే
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
చండ్రుగొండ మండలంలో పనుల జాతర 2025 అనే ప్రత్యేక కార్యక్రమం ద్వారా ఎమ్మెల్యే జారే ఆదినారాయణ సీతాయిగూడెం మంగయ్యబంజర వెంకటయ్యతండా గ్రామాలలో పర్యటించి సీసీ రోడ్లు, ఎంపీపీఎస్ పాఠశాల, ప్రహరీగోడ, మునగ ప్లాంటేషన్ సందర్శన వంటి అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధికారులు మండల నాయకులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
