TEJA NEWS

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు

టీజీఐఐసీ పరిధిలో లక్షా 75 వేల ఎకరాలను తాకట్టు పెట్టే కుట్రపూరిత స్కెచ్ వేసిన రేవంత్ రెడ్డి

నా దగ్గర నిర్ధిష్టమైన ఆధారాలు ఉన్నాయి

టీజీఐఐసీని ప్రైవేటు లిమిటెడ్ నుంచి పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా మార్చడానికి ప్రభుత్వం రహస్య జీవోను విడుదల చేసింది

కంపెనీ హోదాను మార్చడం ద్వారా మరిన్ని వేల కోట్ల రుణం పొందాలన్నది ప్రభుత్వ ఆలోచన

తెలంగాణ భూములను స్టాక్ ఎక్సేంజిలో కుదువపెట్టే కుట్ర జరుగుతోంది

పెద్ద మొత్తంలో అప్పులు తీసుకోడానికి టీజీఐఐసీ ద్వారా ద్వారాలు తెరిచారు

కంపెనీ హోదా మార్పు విషయాన్ని ప్రజలకు చెప్పకుండా ఎందుకు దాచిపెట్టారు

తెలంగాణ భూములను స్టాక్ ఎక్సేంజ్ లో తాకట్టు పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది ?

స్టాక్ ఎక్సేంజ్ లో నష్టం జరిగితే తెలంగాణలో జమా చేసుకున్న భూముల భవితవ్యం ఏమిటి ?

తెలంగాణ ప్రజల భవిష్యత్తుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కనీస ఆలోచన చేయకపోవడం దారుణం

టీజీఐఐసీని పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా మార్చే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి

గత 16 నెలల పాలనలో సీఎం రేవంత్ రెడ్డి రూ 1.8 లక్షల కోట్లకుపైగా అప్పులు చేశారు

తెచ్చిన అప్పులతో ఒక్క పథకాన్ని కూడా సంపూర్ణంగా అమలు చేయలేదు, అభివృద్ధికి వెచ్చించలేదు

తులం బంగారం ఇవ్వలేదు, మహాలక్ష్మీ పథకాన్ని అమలు చేయలేదు, ఏమీ చేయలేదు

గతంలో చేసిన అప్పులకు కేవలం 80 వేల కోట్లు మాత్రమే ఈ ప్రభుత్వం తిరిగి చెల్లించింది

మిగిలిన లక్ష కోట్లు ఎక్కడికి వెళ్లాయి ?

ఆధారాలతో ఆరోపణలు చేస్తున్నాను… లక్ష కోట్లను పెద్ద కాంట్రాక్టర్లకు చెల్లించారు

ఇది 20 శాతం కమీషన్ సర్కార్

కాంట్రాక్టర్లకు చెల్లింపులు చేసి నేరుగా 20 శాతం కమీషన్ తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డి

దాదాపు 20 వేల కోట్లు రేవంత్ రెడ్డి సొంత ఖజానాకు వెళ్లింది

నేను చెప్పింది అప్పయితే ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయాలి

ఒక మంత్రి సొంత కంపెనీకి, మెఘా కంపెనీకి బిల్లులు చెల్లిస్తున్నారు కానీ చేసిన అభివృద్ధి పనులకు కాదు

వేల కోట్ల అప్పులు తెచ్చిన రేవంత్ రెడ్డి సర్కార్ ఒక్క మంచి పని కూడా చేయలేదు

తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరిచే విధంగా సీఎం రేవంత్ రెడ్డి నీచమైన మాటలు మాట్లాడుతున్నారు

కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాలను తాకట్టు పెట్టి రూ 10 వేల కోట్లు అప్పు తెచ్చారు

చెట్లను, ప్రకృతిని నాశనం చేసే ప్రయత్నం చేస్తే ప్రపంచవ్యాప్తంగా ఉన్న పర్యావరణవేత్తలు ఆందోళన చేశారు