
ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయం: ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు …
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుందిగల్ మున్సిపాలిటీ శంభీపూర్ లోని కార్యాలయంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి చెందిన తాజా మాజీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, వివిధ కాలనీల సభ్యులు, సంఘ సభ్యులు మరియు తదితరులు మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు,ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసారు.. ఈ సందర్భంగా పలు సమస్యలు పరిష్కరించాలని విన్నవించారు. వారు సానుకూలంగా స్పందించి ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని తెలిపారు. అదేవిధంగా పలు ప్రాంతాల్లో జరగబోయే శుభకార్యక్రమాల వేడుకల్లో పాల్గొనాలని పలువురు ఆహ్వాన పత్రికలను అందజేశారు…
