TEJA NEWS

పల్నాడు జిల్లా చిలకలూరిపేట బిజెపి పార్టీలోకి చేరిన నూతన సభ్యులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బిజెపి పార్టీ ఆఫీస్ విజయవాడ నందు మన ప్రియతమ నేత మాధవన్ రాష్ట్ర బాధ్యతలు స్వీకరించినారు ఈ సందర్భంగా పల్నాడు జిల్లా అధ్యక్షులు ఏలూరు శశి కుమార్ ఆధ్వర్యంలో బిజెపి పార్టీ లోకి చేరడం జరిగింది చిలకలూరిపేట నియోజకవర్గ నుండి 100 మంది కార్యకర్తలు బిజెపి పార్టీ కండువా కప్పుకొని పార్టీని సంస్థాపకతంగా ముందుకు తీసుకెళ్లటానికి కృషి చేస్తామని ప్రమాణం చేసినారు. ఈ కార్యక్రమంలో చిలకలూరిపేట నియోజకవర్గ బిజెపి కన్వీనర్ తాడిపర్తి జయరామిరెడ్డి, కో కన్వీనర్ మల్లెల శివ నాగేశ్వరరావు, మాజీ పట్టణ అధ్యక్షులు పోత్తూరి బ్రహ్మానందం , జిల్లా కో కన్వీనర్ బండారు నాగరాజు , ఎడ్లపాడు మండల అధ్యక్షులు తులాబందుల సత్యనారాయణ,
బీజేవైఎం స్టేట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ పుల్లుగుజ్జు మహేష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.