TEJA NEWS

గుడివాడ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా అన్న ఎన్టీఆర్ 102వ జయంతి వేడుకలు

స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహాలకు నివాళులర్పించి… జయంతి కేక్ కట్ చేసిన టిడిపి నాయకులు

తెలుగుజాతి గుండె చప్పుడు స్వర్గీయ అన్న ఎన్టీఆర్: టిడిపి నాయకులు

గుడివాడ : గుడివాడ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో స్వర్గీయ అన్న ఎన్టీఆర్ 102వ జయంతి వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి. ఏలూరు రోడ్డులోని టిడిపి కార్యాలయం ప్రజా వేదికలో నిర్వహించిన జయంతి వేడుకల్లో నాయకులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

ముందుగా ఎన్టీఆర్ స్టేడియం కమిటీ వైస్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు, గుడివాడ టిడిపి అధ్యక్షుడు దింట్యాల రాంబాబు, రూరల్ మండల అధ్యక్షుడు వాసే మురళి, సీనియర్ టిడిపి నాయకులు పిన్నమమనేని బాబ్జి, డాక్టర్ గోర్జి సత్యనారాయణ, లింగం ప్రసాద్, చేకూరు జగన్మోహన్రావు తదితర నాయకులు పార్టీ శ్రేణులతో కలిసి ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించి…. జయంతి కేక్ కట్ చేశారు.

అనంతరం ర్యాలీగా ఎన్టీఆర్ స్టేడియం వద్దకు చేరుకున్న పార్టీ శ్రేణులు అక్కడ ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించి జోహార్ ఎన్టీఆర్ అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు.

ఈ సందర్భంగా పార్టీ నాయకులు మీడియాతో మాట్లాడుతూ…. సినీ రంగంలో మకుటం లేని మహారాజుగా అగ్రస్థానంలో ఉండి కూడా తెలుగు ప్రజల కోసం రాజకీయ రంగ చేసిన ఎన్టీఆర్ అణగారిన వర్గాలకు రాజ్యాధికారం కనిపిస్తూ, దేశ రాజకీయాలను ఎంతగానో ప్రభావితం చేశారన్నారు. ఎన్టీఆర్ పాలన, పేద వర్గాల సంక్షేమానికి ఆయన చేసిన కృషి చిరస్థాయిగా తెలుగు ప్రజల గుండెల్లో నిలిచిపోయి ఉంటుందని నాయకులు పేర్కొన్నారు.అన్న ఎన్టీఆర్ స్ఫూర్తితో, ఎమ్మెల్యే వెనిగండ్ల రాము నాయకత్వంలో గుడివాడ అభివృద్ధి, ప్రజల శ్రేయస్సుకు తామంతా కృషి చేస్తున్నామని పార్టీ నాయకులు ఉద్గాటించారు.

ఎన్టీఆర్ జయంతి వేడుకల్లో టిడిపి నాయకులు పండ్రాజు సాంబయ్య ,గుత్తా చంటి, గుడివాడ జోన్స్, పెద్దు వీరభద్ర రావు,సొంటి రామకృష్ణ, షేక్ ఇబ్రహీం, గొర్ల శ్రీలక్ష్మి , గుండిమడ రాఘవేంద్రరావు, కంచర్ల సుధాకర్,పోలాసి ఉమయ్య, అడుసుమిల్లి శ్రీనివాస్,యార్లగడ్డ సుధారాణి, మాదాల సునీత, కోలా నెహ్రూ,బ్రహ్మయ్య, సమ్మెత బ్రహ్మాజీ, బొంబాయి శ్రీను గడ్డం ప్రకాష్ దాస్, దాసు శ్యాం కుమార్, అద్దంకి కమల, రెడ్డి షణ్ముఖ, సయ్యద్ గఫార్, గొర్రెల పాండురంగారావు, పలువు టిడిపి నాయకులు, పార్టీ అనుబంధ విభాగాల నేతలు, పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.