
PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ ప్రత్యేక చొరవ తో మియపూర్ డివిజన్ పరిధిలోని పటేల్ చెరువు,పెద్దకుడి చెరువు, రామసముద్రం కుంట చెరువు, నాయనమ్మ కుంట చెరువులకు మహర్దశ
- శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని 64 చెరువుల ను సుందర శోభిత వనంలు గా తీర్చిదిద్దుతాం* *మల్లిగవాడ్ ఫౌండేషన్ సేవలు అభినందనియం మన భవిష్యత్తు తరాలకు ఆస్తులు కాదు మంచి ఆరోగ్యం ,ప్రశాంత జీవితం ఇవ్వాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది PAC చైర్మన్ ఆరెకపూడి * మియపూర్ డివిజన్ పరిధిలోని మక్తా మహబూబ్ పెట్ లోని పెద్దకుడి చెరువు సుందరికరణలో భాగంగా Nexus select Malls కంపెనీ, IGUS, HDFC బ్యాంక్ ల వారి CSR ఫండ్స్ ద్వారా మల్లిగవాడ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్వచ్ఛందంగా చేపట్టనున్న చెరువుల పునర్జీవనంలొ భాగంగా సుందరికరణ మరియు పునరుద్ధరణ పనులను కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ తో కలిసి పరిశీలించిన PAC చైర్మన్ శ్రీ ఆరెకపూడి గాంధీ
ఈ సందర్భంగా PAC చైర్మన్ అరెకపూడి గాంధీ మాట్లాడుతూ శేరిలింగంపల్లి నియోజకవర్గం లో ని 64 చెరువులను అభివృద్ధి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని, చెరువుల సుందరికరణ తో స్వచ్చమైన వర్షపు జల సిరులను ఒడిసిపడుద్దా మని, చెరువుల జలకళ తో గ్రామీణ వాతావరణం నెలకొల్పడమే నా ధ్యేయంగా పనిచేస్తానని,చెరువులను కాపాడితే అవి మనల్ని కాపాడుతాయి ,జీవ వైవిధ్యం పెరుగుతుంది,పక్షలు వలసలు మొదలు అవుతాయి అని, చెరువుల సంరక్షణ ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని , చెరువులను దత్తత తీసుకొని అభివృద్ధి చేసే వారు కనబడే దేవుళ్ళతో సమానమని PAC చైర్మన్ గాంధీ తెలియచేశారు.
మియపూర్ లో అన్ని చెరువులకు సుందరికరణ భాగ్యము కలిగినది . త్వరలోనే మియపూర్ రూపురేఖలు మారునని దశ దిశ మారినది అని ఇక్కడి పరిసర ప్రాంత ప్రజలకు స్వచ్చమైన ఆహ్లదకరమైన వాతావరణం అందించడమే నా లక్ష్యం అని PAC చైర్మన్ గాంధీ తెలియచేశారు.
, చెరువు పునరుద్ధరణ ప్రభుత్వం, పరిశ్రమలు మరియు సమాజం మధ్య భాగస్వామ్య ప్రయత్నాలు అర్ధవంతమైన పర్యావరణ పురోగతిని ఎలా నడిపించగలదో చెప్పడానికి ఒక శక్తివంతమైన ఉదాహరణగా నిలుస్తుంది. ఈ ప్రాజెక్ట్ కీలకమైన సహజ వనరులను పునరుజ్జీవింపజేయడమే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా భవిష్యత్తులో సుస్థిరమైన అభివృద్ధి కోసం ఒక నమూనాను ఏర్పాటు చేస్తుంది’’ అని అన్నారు.
మియపూర్ లోని చెరువులకు కు నేటి తో దశ దిశ మారినది అని, ఎన్నో ఏండ్ల సమస్య నేటి తో తిరునని, శాశ్వత పరిష్కారం దిశగా చెరువులను అభివృద్ధి చేపట్టడం జరిగినది అని, మురికి కూపంలాంటి చెరువులకు స్వచ్చమైన మంచి నీరు లాంటి చేరువుళ్లుగా తీర్చిదిద్దాడమే ధ్యేయం గా పని చేసి నిరూపించడం జరుగుతుంది అని ,చెరువుల పునర్జీవనం తరువాత సుజల జలం తో అపురూప దృశ్యకావ్యం గా ఆవిష్కృతమైతది అనడంలో ఎటువంటి సందేహం లేదు అని , చెరువు కట్ట చుట్టూ చెట్లు పెంచి చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణం కలిపిస్తామని ఎమ్మెల్యే గాంధీ తెలియచేసారు.Nexus Select Malls ,IGUS, HDFC బ్యాంక్ CSR ఫండ్స్ ద్వారా మల్లిగవాడ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సుందరికరణ చేపట్టుటకు ముందుకు రావడం చాలా అభినదించదగ్గ విషయం అని, సమాజ హితం ,సమాజ సేవ చేయడం కోసం ముందుకు రావడం చాలా గర్వించదగ్గ విషయ అని, సాఫ్ట్ వెర్ సంస్థ ప్రతినిధులను ప్రత్యేకంగా అభినదిస్తున్నాను అని ఎమ్మెల్యే గాంధీ పేర్కొన్నారు. చెరువు సుందరికరణ, సంరక్షణ,అభివృద్ధి పనులు త్వరితగతిన చేపట్టడం జరుగుతుంది అని,త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో కి తీసుకువస్తామని,ఎమ్మెల్యే గాంధీ గారు తెలియచేసారు. అదేవిధంగా చెరువు సుందరికరణ లో భాగంగా చెరువు కట్ట పటిష్టం పరిచేలా పునరుద్ధరణ , మురుగు నీరు చెరువు లో కలవకుండా ప్రత్యేకంగా చెరువు చుట్టూ నిర్మించే మురుగు నీటి కాల్వ (UGD) నిర్మాణం మరియు అలుగు మరమ్మత్తులు, చెరువు కట్ట బలోపేతం ,పునరుద్దరణ పనులు, వాకింగ్ ట్రాక్ వంటి పనులు చేపడుతామని ఎమ్మెల్యే గాంధీ పేర్కొన్నారు చెరువు సంరక్షణ లో భాగంగా చెరువు చుట్టూ ఫెన్సిగ్ (కంచె) నిర్మాణం మరియు చెరువు యొక్క అలుగు నిర్మాణము మరియు చెరువు సుందరికరణ పనులు చేపడుతున్నాం అని ,చెరువు సుందరికరణ మరియు అభివృద్ధి పనులు నాణ్యత ప్రమాణాలతో చేపట్టాలని, నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడకూడదని, త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో కి తీసుకురావాలని అధికారులకు తెలియచేశారు అదేవిధంగా ప్రణాళిక తో పనులు చేపట్టాలని ఎమ్మెల్యే గాంధీ పేర్కొన్నారు .అదేవిధంగా చెరువులను సంరక్షణిచడమే ధ్యేయంగా పనిచేస్తున్నాం అని ఎమ్మెల్యే గాంధీ తెలియచేసారు. అదేవిధంగా చెరువును సుందరవనం గా ,శోభితవర్ణం గా తీర్చిదిద్దుతామని, అదేవిదంగా చెరువు ల చుట్టూ వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేసి చెరువు ల ను సంరక్షిస్తామని ఎమ్మెల్యే గాంధీ గారు పేర్కొన్నారు .చెరువు ల వాకింగ్ ట్రాక్ నిర్మాణం గూర్చి అధికారులకు పలు సూచనలు సలహాలు ఇవ్వడం జరిగినది .త్వరిత గతిన వాకింగ్ ట్రాక్ పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని PAC చైర్మన్ గాంధీ తెలియచేశారు .
చెరువు అపరిశుభ్రం వలన పేరుకుపోయిన గుర్రపు డెక్క వలన దోమల పెరగడం వలన స్థానికులకు ఏర్పడుతున్న ఇబ్బందులను ,అనారోగ్యాలకు గురవడం స్థానికులు పలుమార్లు ఎమ్మెల్యే కి పిర్యాదు చేయడం వలన దీనికి స్పందించిన ఎమ్మెల్యే గారు స్థానికులు పడుతున్న ఇబ్బందులను తొలగించడానికి గతంలో చెరువును దత్తత తీసుకొని సొంత నిధులతో చెరువును శుభ్రపరిచి సుందరీకరణ చేసిన సంగతి విదితమే .అదేవిధంగా ప్రజలకు చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందిస్తామని చెప్పడం జరిగినది , తామర పువ్వులను పెంచి కలుషితం కాకుండా చెరువును సుందరీకరిస్తామని ఎమ్మెల్యే గాంధీ చెప్పటం జరిగినది .చెరువులను సుందరీకరించి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని ,చెరువులు కలుషితం కాకుండా మరియు కబ్జాలకు గురికాకుండా చెరువులను పూర్తి స్థాయి లోసంరక్షిస్తామని , చెరువు చుట్టూ పెన్సింగ్ ఏర్పాటు చేసి వాకింగ్ ట్రాక్ ను ఏర్పాటు చేసి ,ప్రజలకు చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందిస్తామని,అలాగే నియోజకవర్గం లోని అన్ని చెరువులను పూర్తి స్థాయిలో సుందరీకరిస్తామని ఎమ్మెల్యే చెప్పటం జరిగినది చెరువుల పరిరక్షణకు పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే గాంధీ చెప్పడం జరిగింది .
చెరువు చుట్టుపక్కల కాలనీ వాసులు మరియు ప్రజలు చెరువును సంరక్షించడంలో ప్రతి ఒక్కరు బాధ్యత యుతంగా సామాజిక బాధ్యతో సంరక్షించుకోవలని, చెరువుల పరిరక్షణ లో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని PAC చైర్మన్ గాంధీ తెలియచేసారు.
ఈ కార్యక్రమంలో ఐటీ సంస్థ ప్రతినిధులు రామ్ బొట్ట, చైతన్య,నాయకులు బాలింగ్ గౌతమ్ గౌడ్, ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, వెంకటేష్ గౌడ్, మల్లెష్ గౌడ్ , కాలనీల అసోసియేషన్ సభ్యులు, కాలనీ వాసులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
