
ప్రజలు యోగాను జీవనశైలిలో భాగంగా చేసుకోవాలి.
యోగాతో ఆరోగ్యం మానసిక ఒత్తిడి దూరం.
రామతీర్థం యోగాంధ్ర కార్యక్రమంలో వేమిరెడ్డి దంపతులు జిల్లా కలెక్టర్ హిమాన్స్ శుక్లా.
ప్రజలు జీవనశైలిలో యోగాను భాగంగా చేసుకోవాలని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి సూచించారు. విడవలూరు మండలం రామతీర్థం బీచ్ వద్ద ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల తో కలిసి యోగేంద్రకార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా శిక్షకుల ఆధ్వర్యంలో పలు ఆసనాలనువేశారు.ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. యోగ తో ఆరోగ్యంతో పాటు మానసికఒత్తిడిదూరంఅవుతుందని, ప్రతి ఒక్కరు నిత్యం ఓ అరగంటసేపు యోగాకు కేటాయించాలని ఆమె సూచించారు. ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని ఉద్దేశంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యోగాంధ్ర అనే కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజలను చైతన్య వంతులను చేస్తుందన్నారు.
యోగాను మనఅవలంబిస్తేమనతోపాటుఇంట్లోపిల్లలుచుట్టుపక్కలవారుచేస్తారన్నారు.అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ..జూనియర్ 8 నుండి 21 వరకు ఆంధ్రప్రదేశ్ మొత్తం యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. యోగా అనేది మన భారతీయ సంస్కృతిలోనే ఉందని మన సంస్కృతి సంప్రదాయాలను ప్రపంచంమొత్తంఅవలంబిస్తుందన్నారు.ఈ పని ఒత్తిడి దూరం చేసేందుకు యోగఉపయోగపడుతుందని, ప్రతి ఒక్కరూ యోగాను చేయటంఅలవాటుచేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో.యోగా గురువు డా.స్వప్న, జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు, బెజవాడ వంశీకృష్ణారెడ్డి, ఆవుల వాసు, స్థానిక నాయకులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.