Spread the love

ఢిల్లీ సీఎంగా రేఖ గుప్తా!

ఢిల్లీ సీఎంగా రేఖ గుప్తా పేరు దాదాపు ఖరారైనట్లుగా తెలుస్తోంది. బీజేపీ అధిష్టానం ఆమె వైపే మొగ్గు చూపుతున్నట్లుగా జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ఇవాళ అధికారికంగా ఈమె పేరును బీజేపీ పెద్దలు ప్రకటించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రేఖ గుప్తా షాలిమార్ బాగ్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మహిళా సీఎంలు లేరు. అందుకోసమే ఢిల్లీ పీఠంపై మహిళను కూర్చోబెట్టాలని హైకమాండ్ భావిస్తోన్నట్లు తెలుస్తోంది.