
ఏపీ, తెలంగాణ నేతల సిఫార్సు లేఖలు పునరుద్ధరణ
** టీటీడీ పాలకుల తాత్కాలిక నిర్ణయం
తిరుపతి: తిరుమల శ్రీవారి దర్శనార్థం ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల సిఫార్సు లేఖల పునరుద్ధరణకు టీటీడీ పాలకులు తాత్కాలికంగా నిర్ణయం తీసుకున్నారు.
ఈ నెల 15వ తేదీ నుంచి సదరు నేతల సిఫార్సు లేఖలను మాత్రమే టీటీడీ అనుమతించనుంది. అయితే మిగిలిన వారి సిఫార్సు లేఖల పై అంతకు ముందు తీసుకున్న నిర్ణయం కొనసాగుతుందని పేర్కొన్నారు. నియమావళి ప్రకారం అనుమతి పొందిన భక్తులకు ఈ నెల 16వ తేదీ నుండి శ్రీవారి దర్శనం కల్పించనున్నారు.
