
శేరిలింగంపల్లి జోనల్ కార్యాలయంలో జరిగిన సమీక్షా సమావేశంలో జోనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డి , కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ , GHMC ఇంజనీరింగ్ విభాగం, టౌన్ ప్లానింగ్, విద్యుత్,స్ట్రీట్ లైట్స్ మరియు ఇతర విభాగం అధికారులతో కలిసి శేరిలింగంపల్లి నియోజకవర్గంలో నెలకొన్న పలు సమస్యలు మరియు చేపట్టవలసిన పలు అభివృద్ధి పనుల పై సమీక్షా సమావేశం నిర్వహించిన PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ .
ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ అన్ని విభాగల అధికారులు సమన్వయంతో పనిచేయాలని, సమిష్టి కృషి తో శేరిలింగంపల్లి నియోజకవర్గం ను అన్ని రంగాలలో అభివృద్ధి కి ప్రతి ఒక్కరు కృషి చేయాలని శేరిలింగంపల్లి నియోజకవర్గంలో నెలకొన్న పలు సమస్యలు మరియు చేపట్టవలసిన పలు అభివృద్ధి పనుల పై చర్చించడం జరిగింది .
పెండింగ్ లో ఉన్న పనులు త్వరితగతిన పూర్తయ్యేలా అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని, అసంపూర్తిగా మిగిలిపోయిన పనులు త్వరితగతిన పూర్తయ్యేలా చూడలని , కొత్త ప్రతిపాదనలు తీసుకురావాలని, అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలని,అవసరమైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి అధిక మొత్తంలో నిధులు మంజూరు అయ్యేలా కృషి చేస్తానని, పనులలో వేగం పెంచాలని సకాలంలో నిధులు మంజూరు అయ్యేలా చూడలని , అభివృద్ధి పనులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడలని,
రోడ్లు, డ్రైనేజి, మంచినీటి వసతి, విధి దీపాలు వంటి మౌలిక వసతుల కల్పనకు పెద్ద పీట వేయాలని అవసరమున్న చోట యుద్ధప్రాతిపదికన రోడ్లు వేయాలని తెలియచేశారు.
నాలల విస్తరణ పనులను వేగవంతం చేయాలని , పనులలో జాప్యం లేకుండా త్వరితగతిన పూర్తి చేయాలని, వర్షాకాలం లోపు పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని, నాలల విస్తరణ పనులు వేగవంతం చేయాలని PAC చైర్మన్ గాంధీ తెలియచేశారు.
అదేవిధంగా మంజీర పైప్ లైన్ రోడ్డు నిర్మాణం పనులు వెంటనే చేపట్టాలని, శ్రీదేవి థియేటర్ నుండి అమిన్ పూర్ రోడ్డు విస్తరణ పనులు త్వరితగతిన చేపట్టాలని, గంగారాం హనుమాన్ దేవాలయం ప్రధాన రహాదారి నుండి అపర్ణ వరకు లింక్ రోడ్డు పనులు త్వరితగతిన ప్రారంభంయ్యేలా చూడలాని, ప్రజఅవసరాల దృష్ట్యా లింక్ రోడ్ల పనులు త్వరితగతిన పూర్తి అయ్యేలా చూడలని,కూడలి ల సుందరి కరణ చేపట్టాలని, చెరువుల సుందరికరణ, పార్క్ లు అభివృద్ధి చేపట్టాలని, రోడ్ల మరమ్మతులు చేపట్టాలని, అభివృద్ధి విషయంలో ఎక్కడ రాజి పడకూడదు అని, అధికారులతో చర్చించి తక్షణమే చర్యలు తీసుకోవాలని, ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల మౌలిక వసతులు ఏర్పాటు కు కృషి చేయాలని PAC చైర్మన్ గాంధీ తెలియచేసారు.
ప్రజల సౌకర్యార్థం ట్రాఫిక్ రహిత సమాజం కోసం ట్రాఫిక్ మెరుగుదల పై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, ట్రాఫిక్ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని, ప్రత్యేక డ్రైవ్ పెట్టి ఫూట్ పాత్ ల అక్రమాలను తొలగించాలని, ఫూట్ ఫాత్ ఆక్రమించిన వారి పై కఠిన చర్యలు తీసుకోవాలని, బాటసారులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడలని , ప్రజలకు మెరుగైన సుఖవంతమైన ప్రయాణానికి బాటలు వేస్తామని PAC చైర్మన్ గాంధీ తెలియచేసారు.
ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ విరేశం గౌడ్, సీనియర్ నాయకులు రఘునాథ్ రెడ్డి, ఇంజనీరింగ్ విభాగం అధికారులు SE శంకర్ నాయక్, EE GK దుర్గ ప్రసాద్, DE ఆనంద్ , టౌన్ ప్లానింగ్ అధికారులు శేరిలింగంపల్లి జోన్ సిటీ ప్లానర్ శ్యామ్ కుమార్,డిప్యూటీ సిటీ ప్లానర్ తులసి రామ్, ఏసీపీ వేంకట రమణ, TPS రవీందర్, TPS జిషాన్ ఎలక్ట్రిసిటీ స్ట్రీట్ లైట్స్ EE మల్లికార్జున్, DE కవిత మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.
