మూలపల్లి ముత్యాలమ్మకు సారె సమర్పణ

TEJA NEWS

మూలపల్లి ముత్యాలమ్మకు సారె సమర్పణ

** రాష్ట్ర యాదవ కార్పొరేషన్ చైర్మన్ హాజరు

చంద్రగిరి: చంద్రగిరి మండలం భీమవరం పంచాయతీ మూలపల్లి గ్రామంలో వెలసిన
“శ్రీశ్రీ మూలపల్లి ముత్యాలమ్మ” తల్లికి యాదవ కార్పొరేషన్ చైర్మన్ గొల్ల నరసింహ యాదవ్ దంపతులు సారె సమర్పించారు. అనంతరం నరసింహ యాదవ్ మాట్లాడుతూ ఈ దేవాలయాన్ని 50 సంవత్సరాల క్రితం తమ తల్లి తండ్రులు గొల్ల ఉత్తమ్మ, కదిరప్ప యాదవ్ లు విగ్రహాలను ప్రతిష్టించి గుడి నిర్మాణం చేసారని తెలిపారు. అనంతరం
ఆ దేవాలయమును మూలపల్లి గ్రామస్తులు పునః నిర్మాణం చేసారని, దేవాలయ కుంభాభిషేకంలో తమ కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొని అమ్మవారికి “సారె”సమర్పించామని చెప్పారు. చివరగా ఆలయం వద్ద భక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేశారు.

You cannot copy content of this page

Scroll to Top