
ఏపీలో త్వరలో శనివారం ‘నో బ్యాగ్ డే’
ఏపీలో వచ్చే విద్యాసంవత్సరం నుంచి ‘శనివారం.. నో బ్యాగ్ డే’గా మారనుంది. ఆ రోజున పిల్లలు బడులకు బ్యాగులు తీసుకురావాల్సిన అవసరం లేదు.
ఆ రోజు తరగతులకు బదులుగా ఇతరత్రా పోటీలు నిర్వహించనున్నారు. అందుకు అనుగుణంగా పాఠశాల విద్యాశాఖ 2025-26 అకడమిక్ క్యాలెండర్ రూపొందిస్తోంది. అయితే విద్యార్థులకు కొత్తదనం ఉండేలా శనివారం రోజున క్విజ్లు, సమకాలీన అంశాలపై డిబేట్లు, పోటీలు లాంటివి నిర్వహిస్తారు.
