TEJA NEWS

శేరిలింగంపల్లి: రూ.70 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన అధికారి

రూ.70 వేలు లంచం తీసుకుంటూ శేరిలింగంపల్లి జోనల్ మున్సిపల్ కార్యాలయంలో అర్బన్ బయోడైవర్సిటీ డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాస్ ఏసీబీకి చిక్కారు. శ్రీనివాస్ చార్మినార్ జోన్ ఇన్ఛార్జిగా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. చాంద్రాయణగుట్ట సర్కిల్లో రూ.45 లక్షల మొక్కల కాంట్రాక్ట్కు సంబంధించిన బిల్లులను క్లియర్ చేయడానికి కాంట్రాక్టర్ దగ్గర నుంచి రూ.2,20,000 లంచం డిమాండ్ చచేశారు. రూ.70 వేలు తీసుకుంటూ పట్టుబడ్డారు.