
రోడ్డు మీద వెళ్లేవారిపై రంగులు చల్లితే కఠిన చర్యలు’
తెలంగాణ : హోలీ సందర్భంగా హైదరాబాద్లో పోలీసుల ఆంక్షలు విధించారు. 14న ఉదయం 6 నుంచి 15వ తేదీ ఉదయం 6 గంటల వరకు ఆంక్షలు పెట్టారు. రోడ్డు మీద వెళ్లేవారిపై రంగులు చల్లితే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరికలు జారీచేశారు. రోడ్లపై గుంపులుగా ర్యాలీలు నిర్వహించొద్దని తెలిపారు. ఈ నిబంధనలు ఎవరైనా అతిక్రమిస్తే చర్యలు తప్పవని సీపీ అవినాష్ మహంతి హెచ్చరించారు.
