
- తెలంగాణా శాసన మండలిలో టీ పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ స్క్రోలింగ్ పాయింట్స్*:
- తెలంగాణలోని బడుగు బలహీన వర్గాలకు నేడు చారిత్రాత్మక దినం
- 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని బిల్లును చట్టసభల్లో ఆమోదంతో బడుగు బలహీన వర్గాలకు సామాజిక న్యాయం కాంగ్రెస్తోనే సాధ్యమని నిరూపితమైంది
- బీజేపీ, బిఆర్ ఎస్ నేతలకు ఇదే నా సవాల్..
- దేశ వ్యాప్తంగా కుల గణన సర్వే కోసం కేంద్రాన్ని అడగడానికి మాతో కలిసి బీజేపీ, బిఆర్ఎస్ నేతలు వస్తారా?
- చారిత్రాత్మక బీసీ బిల్లును ప్రవేశపెడుతున్న కాంగ్రెస్తో బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు కలిసిరాకపోతే బీసీ సామాజికవర్గం ఆ పార్టీలను ఎన్నటికీ క్షమించదు.
- బీజేపీ వారికి నిజంగా బీసీలకు న్యాయం చేయాలని ఉంటే దీన్ని కేంద్రంలో కూడా ఆమోదించేలా బీజేపీ అధిష్టానాన్ని ఒప్పించాలి.
- విద్య, ఉపాధి రంగాల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని బిల్లును చట్టసభల్లో ఆమోదంతో
కాంగ్రెస్ పార్టీయే బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేస్తుందని మరోసారి రుజువయ్యింది. - సామాజిక న్యాయానికి కాంగ్రెస్ పార్టీ పెద్దపీట వేస్తుందని చెప్పడానికి బీసీ రిజర్వేషన్ల, ఎస్సీ వర్గీకరణ బిల్లులను చట్టసభల్లో ప్రవేశపెట్టడమే నిదర్శనం
- ఎన్నికల్లో హామీ ఇచ్చిన ప్రకారం రాష్ట్రంలో కులగణన పూర్తి చేసి కాంగ్రెస్ చరిత్ర సృష్టించడమే కాకుండా దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది.
- దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాని డిమాండ్ చేస్తున్నా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్నిడిమాండ్ చేస్తున్నా..
- బీజేపీ నేతలకు చిత్త శుద్ధి ఉంటే 42 శాతం రిజర్వేషన్ల బిల్లుకు మద్దతు తెలపండి
- రాష్ట్రంలో కులగణన పూర్తి చేసిన కాంగ్రెస్ బీసీలకు న్యాయం చేసే దిశగా వారికి స్థానిక సంస్థల ఎన్నికల్లో, విద్య, ఉపాధి రంగాల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని బిల్లును చట్టసభల్లో ఆమోదం తర్వాత కేంద్రానికి పంపిస్తుంది.
- గతంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్లు 23 శాతానికి తగ్గించి చారిత్రాత్మక తప్పు చేసిన బీఆర్ఎస్ ఇప్పుడు పశ్చాతాపం వ్యక్తం చేస్తూ, బిల్లు ఆమోదం కోసం కేంద్రంపై ఒత్తిడి తేవాలి.
- తెలంగాణకు తొలి ముఖ్యమంత్రిగా దళితుడిని చేస్తానని చెప్పిన కేసీఆర్, గెలిచాక తానే గద్దెనెక్కి దళితులను అవమానించారు.
