TEJA NEWS

దేవాలయాలు సాంస్కృతికంగా, ఆధ్యాత్మికంగా సమాజాన్ని ఒకటిగా చేర్చే కేంద్రాలు – బి.ఆర్.ఎస్.పార్టీ విప్ ఎమ్మెల్యే కె.పి.వివేకానంద.

శేరిలింగంపల్లి నియోజకవర్గం, ఆల్విన్ కాలనీ డివిజన్-124 పరిధిలోని శివమ్మ కాలనీలో గల శ్రీ రామాలయ 4వ వార్షికోత్సవాన్ని శ్రద్ధాభక్తులతో, వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు, హోమాలు, కల్యాణోత్సవం వంటి కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి.

ఈ కార్యక్రమానికి కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే కె.పి. వివేకానంద మరియు శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ ముఖ్య అతిథిలుగా పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్బంగా అతిథులు ఆలయాన్ని సందర్శించి “ఇలాంటి కార్యక్రమాలు భక్తుల ఐక్యత మరియు ఆధ్యాత్మిక శ్రద్ధకు నిదర్శనమని అన్నారు”..

ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, భక్తులు, ఆలయ కమిటీ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేశారు.