
సన్నబియ్యంతో పేదల కడుపు తీపిని తీర్చిన కారణజన్ముడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి — కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని 125 డివిజన్ లెనిన్ నగర్ లో సన్నబియ్యం లబ్దిదారులు లక్ష్మమ్మ భాస్కర్ దళిత కుటుంబ సభ్యుల ఆహ్వానం మేరకు మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ వారి కుటుంబ సభ్యులతో కలిసి సహాపంక్తి భోజనం చేశారు..
అనంతరం లబ్ధిదారుని ఇంట్లో డా. బాబా సాహెబ్ అంబేద్కర్ చిత్రపటానికి పూలువేసి లక్ష్మమ్మ కుటుంబానికి ప్రభుత్వం నుండి ఎన్ని సంక్షేమ పథకాలు అందుతున్నాయో అడిగి తెలుసుకున్నారు..
ఈ సందర్భంగా కూన శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ..
— తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నాయకత్వంలో ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన సన్నబియ్యం పథకం లబ్దిదారుని ఇంట్లో మధ్యాహన భోజనం చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు..
— ప్రజా ప్రభుత్వం ఏర్పడ్డాక మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం. గృహజ్యోతి పథకం ద్వారా నిరుపేదల ప్రజలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్.రైతు భరోసా ద్వారా రైతులకు12వేల పెట్టుబడి సహాయం. రైతులకు 2 లక్షల రుణమాఫీ. ప్రజా ప్రభుత్వ తొలి ఏడాదిలోనే 50 వేలకు పైన ప్రభుత్వ ఉద్యోగాలు.ఇందిరమ్మ ఇండ్లు పథకం ద్వారా పేదల ఇంటి నిర్మాణానికి 5 లక్షల ఆర్థిక సహాయం.తెలంగాణ రైతంగానికి రక్షణ కవచంగా భూభారతి పథకం. పేద,మధ్యతరగతి ప్రజల ఆరోగ్యమే మహాభాగ్యంగా 10 లక్షల ఆరోగ్యశ్రీ పథకం.అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం ఎస్సి వర్గీకరణకు. బడుగు బలహీన వర్గాల భావితరాల భవిష్యత్తు కోసం బిసిలకు42% రిజర్వేషన్.నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పనకోసం రాజీవ్ యువ వికాస్ పథకం ద్వారా 5 లక్షల వరకు ఆర్ధిక సహాయం ఇలా ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతుందన్నారు..
— బిజెపి,బిఆర్ఎస్ ప్రజా ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను చూసి ఓర్వలేక,జిర్ణించుకోలేక ప్రజను ప్రక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారన్నారు..
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు ఆధ్వర్యంలో మన రాష్ట్రం సాంకేతిక, పారిశ్రామిక రంగాలలో గణనీయంగా అభివృద్ధి చెందుతుందన్నారు..
ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి సొంటిరెడ్డి పున్నారెడ్డి, బుచ్చిరెడ్డి, రషీద్ బేగ్, రాజిరెడ్డి, రామ్ నర్సయ్య, రామిరెడ్డి,శ్రీనివాస్, నాగరాజు, శ్రీదేవి, చంద్రవతి, లత, రవి, మధు, సంతోష్,సతీష్,లాల్ మహమ్మద్, రవీందర్ రెడ్డి, వెంకట్ రాజు, ఆనంద్, రవి చారి తో పాటు కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు..
