
పొగాకు ఉత్పత్తులు సేవించడం వల్ల కలిగే అనారోగ్య కారణాలను ప్రజలకు తెలియచేసే లక్ష్యంతో ప్రతి ఏటా మే 31 వ తేదీన ప్రపంచ పొగాకు వ్యతిరేఖ దినోత్సవం ( World No Tobacco Day ) సందర్భంగా PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ నివాసం వద్ద ప్రజాపిత బ్రహ్మ కుమారిస్ ఐశ్వర్య విశ్వ విద్యాలయం వారి ఆధ్వర్యంలో జరిగిన అవగహన ర్యాలీ లో కూకట్పల్లి డీసీ గంగాధర్ తో కలిసి పాల్గొని జెండా ఊపి ర్యాలీని ప్రారంభించిన PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ .
ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ ఆరోగ్యమే మహా భాగ్యం అని ,
పొగాకు ఉత్పత్తులు సేవించడం వల్ల కలిగే అనారోగ్య కారణాలను ప్రజలకు తెలియచేసే లక్ష్యంతో ప్రతి ఏటా మే 31 వ తేదీన ప్రపంచ పొగాకు వ్యతిరేఖ దినోత్సవం ( World No Tobacco Day ) నిర్వహించడం జరుగుతుంది అని PAC చైర్మన్ గాంధీ తెలియచేసారు. సిగరెట్లు , చుట్టలు, బీడీలు, గుట్కా, ఖైనీ, జర్ధా మొదలైనవి పొగాకు ఉత్పత్తుల కిందికి వస్తాయి అని, ఇందులో ఉండే నికోటిన్ వదల్లేని అలవాటుగా మారి మానవులను వ్యసనపరులను చేస్తుంది అని, ధూమపానం ప్రభావం ఊపిరితిత్తుల పై నేరుగా పడుతుంది అని PAC చైర్మన్ గాంధీ తెలియచేసారు. అంతే గాక గుండె సంబంధిత జబ్బులు ,సంతాన లేమి సమస్యలు, వివిధ క్యాన్సర్లు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అని, పొగాకు ఉత్పత్తుల వాడటం వలన కలిగే దుష్ప్రభావల గురించి ప్రజలలో చైతన్యపర్చడమే ఈ రోజు ముఖ్య ఉద్దేశ్యం అని, సమ సమాజ స్థాపన కోసం భవిష్యత్తు తరాల వారి బాగు కోసం పొగాకు ఉత్పత్తులు వినియోగించడం తగ్గించాలని, పొగాకు వినియోగం పై కఠిన చర్యలు తీసుకోవాలని, పొగాకు వాడకం తగ్గించడం కోసం ప్రజలలో, యువకులలో విస్తృతంగా అవగాహన కల్పించాలని PAC చైర్మన్ గాంధీ తెలియచేసారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) గణాంకాల ప్రకారం పొగాకు వినియోగం కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఏటా 80 లక్షల మంది మరణిస్తున్నారు అని, ఇందులో సుమారుగా 13 లక్షల మంది నేరుగా ధూమపానం చేయకపోయిన గాలి లోని పొగ పీల్చడం వల్ల చనిపోతున్నారు అని ఇది చాలా బాధాకరమైన విషయం అని PAC చైర్మన్ గాంధీ అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా 130 కోట్ల మంది పొగాకు ను వినియోగిస్తుండగా వారిలో 80% ప్రజలు అల్ప, మధ్య ఆదాయ దేశాలలో నివసిస్తున్నారు అని ,2025 లో పొగాకు ఉత్పత్తి వినియోగంలో భారత్ రెండవ స్థానంలో ఉన్నట్లు WHO పేర్కొంది అని PAC చైర్మన్ గాంధీ అన్నారు.
ఈ కార్యక్రమంలో నాయకులు మంత్రి ప్రగఢ సత్యనారాయణ రావు, బ్రహ్మ కుమారిస్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
