Spread the love

శ్రీశైలం మహాక్షేత్రంలో ఐదు రోజుల పాటు ఉగాది మహోత్సవాలు నిర్వహించనున్నట్లు దేవస్థానం ఈఓ ఎం.శ్రీనివాసరావు తెలిపారు. ఉత్సవాల్లో భాగంగా రోజూ సాయంత్రం స్వామి అమ్మవార్లకు వాహన సేవలు మరియు అమ్మవారికి ప్రత్యేక అలంకరణలు ఉంటాయని చెప్పారు. ఉత్సవమూర్తులకు రాత్రి 7 గంటల నుంచి గ్రామోత్సవం జరుగుతుందన్నారు.