
విజయవాడలో కేంద్రమంత్రి హర్ దీప్ సింగ్ పూరికి ఘన స్వాగతం పలికిన ఎమ్మెల్యే సుజనా చౌదరి
కేంద్ర పెట్రోలియం సహజవాయువు శాఖామంత్రి హర్ దీప్ సింగ్ పూరికి మాజీ కేంద్ర మంత్రి విజయవాడ పశ్చిమ శాసనసభ్యులు యలమంచిలి సత్యనారాయణ (సుజనా చౌదరి) గన్నవరం విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికారు.
కేంద్ర బడ్జెట్ 2025-26 పై పాత్రికేయుల సమావేశం నోవాటెల్ హోటల్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విజయవాడ విచ్చేసిన హర్ దీప్ సింగ్ పూరికి ఎమ్మెల్యే సుజనా చౌదరి, ఏపీ బిజెపి మీడియా ఇంచార్జ్ పాతూరి నాగభూషణం, ఎన్టీఆర్ జిల్లా బిజెపి అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ ఘన స్వాగతం పలికారు.
