
సిఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేసిన వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ….
హనుమకొండ సుబేదారి లోని ఎమ్మెల్యే నివాస క్యాంప్ కార్యాలయం నందు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 55వ డివిజన్ పరిధిలో అనారోగ్యానికి గురైన వారు సిఎంఆర్ఎఫ్ కు దరఖాస్తు చేసుకోగా మంజూరైన లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్ఎఫ్) 5 చెక్కులు సుమారు 2లక్షల 50 వేల రూపాయల విలువ గల చెక్కులను వర్ధన్నపేట ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు పంపిణీ చేశారు…
అనంతరం ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ:-
పేదలను అభివృద్ధి చేయడమే మన ప్రజా ప్రభుత్వం లక్ష్యం అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందే విధంగా కృషి చేస్తానన్నారు….
సిఎం రేవంత్ రెడ్డి ఎన్నికలో రైతులకు ఇచ్చిన మాట ప్రకారం 2 లక్షల వరకు ఉన్న రుణమాఫీ చేసిన మన ప్రజా ప్రభుత్వం అన్నారు…
ఈనెల 26 నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోస, రైతు భరోస, నూతన రేషన్ కార్డుల పంపిణీ పథకాల లబ్ధిదారుల ఎంపిక కోసం అధికారులు సర్వే నిర్వహిస్తున్నారని తెలిపారు. ఈ క్రమంలో అధికారుల వద్ద ఉన్న జాబితాలో పేరు లేని పథకాలకు అర్హులైన లబ్ధిదారులను దరఖాస్తు చేసుకునే విధంగా అవగాహన కల్పించాలని సూచించారు. పథకాల కోసం దరఖాస్తు ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని వెల్లడించారు. నేటి నుంచి నుంచి ఈ నెల 25 వరకు గ్రామ సభలు నిర్వహిస్తున్న తరుణంలో సభలలో సైతం దరఖాస్తు చేసుకోవచ్చని లబ్ధిదారులకు సూచించారు. దీనిపై అర్హులు ఏలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. ప్రజాధనం దుర్వినియోగం కాకుండా సాగుభూములకే రైతు భరోసా ఇవ్వడం, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో భాగంగా మొదటి విడతలో అత్యంత నిరుపేదలకు ప్రాధాన్యతను ఇవ్వడం, భూమి లేకుండా ఉపాధి హామీ పనిచేసుకునే నిరుపేదలకు ఆర్థిక భరోసా ఇవ్వడం, గత పదేళ్లుగా రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డులు ఇవ్వడం లాంటి పథకాలు ప్రవేశ పెడుతున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుందని కొనియాడారు. గత ప్రభుత్వం పదేళ్లు అధికారంలో ఉన్న టిఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదని విమర్శించారు. పేదలకు సంక్షేమం కోసం అమలు చేస్తున్న పథకాలకు రాజకీయాలకతీతంగా మద్దతు పలకాలని కోరారు..
ఈ కార్యక్రమంలో 55వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గడ్డం శివరాం ప్రసాద్, చల్లా సుమంత్, డివిజన్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు…..
