TEJA NEWS

30న ఈ జిల్లాలో వాహనాలు వేలంపాట

నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలోని ఎక్సైజ్ కార్యాలయంలో ఈనెల 30 తారీఖున వాహనాలు వేలం పాట నిర్వహిస్తున్నట్టు ఎక్సైజ్ శాఖ సీఐ వెంకట్ రెడ్డి తెలిపారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎక్సైజ్ కేసులో పట్టుబడిన బైకులు, ఆటోలు, ఫోర్ వీలర్, వాహనాలను వేలంపాట వేస్తున్నట్టుగా మే నెల 30న 10 గంటల 30 నిమిషాలకు వేలంపాట ఉంటుందన్నారు, ఆసక్తి గలవారు నిర్ణీత రుసుము డిపాజిట్ చెల్లించి ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాలని ఎక్సైజ్ సీఐ వెంకట్ రెడ్డి పేర్కొన్నారు.