వెంకటేశ్వర స్వామి సన్నిధిలో
దారపనేని
కనిగిరి : నెల్లూరు జిల్లాలో ప్రసిద్ధి చెందిన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో పామూరు మండలం మోపాడు గ్రామ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, ప్రముఖ బిల్డర్ దారపనేని సుబ్బారావు, ధర్మపత్ని సుధారాణి, కుమారులు శ్రీరామ్ చౌదరి, నందకిషోర్ చౌదరి కుటుంబ సమేతంగా వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవస్థానం ధర్మకర్త పెండ్యాల సూర్యనారాయణ స్వామివారి చిత్రపటం, తీర్థప్రసాదాలు అందజేశారు. వచ్చావ కాంతమ్మ, మేడసాని వెంకటస్వామి, నాగలక్ష్మి మరియు బంధుమిత్రులు ప్రత్యేక పూజలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా దారపనేని సుబ్బారావు ఆలయ ధర్మకర్త పెండ్యాల సూర్యనారాయణ తో దేవస్థానం అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని పేర్కొన్నారు.
