
అక్రమ ఇసుక రవాణాకు అడ్డు ఎవరు
.చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్న అధికార యంత్రాంగం,
.అక్రమ ఇసుక మాఫియా రెచ్చిపోతుంది,
.అడ్డు అదుపు లేకుండా తవ్వేస్తున్నారు,
.ఈ వ్యవహారంపై అధికారులకు తెలిసిన కాసులకు కక్కుర్తి పడి నోరు మెదపడం లేదు,
.అక్రమంగా ఇసుక తరలిస్తూ కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నారు,
నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి రెవెన్యూ డివిజన్ పరిధిలోని వంగూరు మండలం పోతిరెడ్డిపల్లి గ్రామ శివారులోని దుందుభి వాగు నుంచి అనుమతుల పేరుతో అధికార పార్టీ నాయకులు అక్రమ ఇసుక రవాణా ఇష్టానుసారంగా చేస్తున్న పట్టించుకోకపోవడం ఆశ్చర్యం, దుందుభి వాగులో అక్రమ ఇసుక రవాణా చేసేందుకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది అంటూ ఎవరి ఇష్టానుసారంగా వారు తవ్వుకుంటున్నారు దుందుభి బాగా నుండి డాక్టర్లలో టిప్పర్లలో లారీలలో చీమలదండు ల కల్వకుర్తికి వస్తున్న అధికారులు ఏమాత్రం స్పందించకపోవడం గమనార్ధం, ఈ విషయమై ప్రజలలో పలు రకాల అనుమానాలు ఉప్పొంగుతున్నాయి, ఎవరికి చెందవలసిన ముడుపులు వారికి చెందుతున్నాయా అని పలువురు ప్రశ్నిస్తున్నారు, ఇప్పటికైనా సంబంధిత అధికారులు వెంటనే స్పందించి అక్రమ ఇసుక రవాణాను అడ్డుకోవాలని చుట్టుపక్కల పలు గ్రామాల ప్రజలు కోరుతున్నారు.
