TEJA NEWS

నాపై తప్పుడు వార్తలను పార్టీ ఎందుకు ఖండించలేదు: కవిత

TG: BRS చేయాల్సిన సగం పనులను జాగృతి తరఫున తాను చేస్తున్నానని MLC కవిత చెప్పారు. తనపై వస్తున్న తప్పుడు వార్తలను పార్టీ ఎందుకు ఖండించడం లేదని నిలదీశారు. దూతలను పంపి రాయబారాలు చేస్తే ఏం లాభమని ప్రశ్నించారు. KCRకు నోటీసులొస్తే ఎవరూ స్పందించలేదని, మరో నేతకు వస్తే ఎందుకు హంగామా చేశారంటూ ఫైరయ్యారు. పార్టీలో కోవర్టులు ఉన్నారని ఒప్పుకుంటున్నప్పుడు వాళ్లను ఎందుకు పక్కన పెట్టడం లేదని దుయ్యబట్టారు.