
ఎమ్మెల్సీ గా ఆలపాటి రాజేంద్రప్రసాద్ ని గెలిపించుటకు విస్తృత పర్యటన -MLA బొండా ఉమ
రాష్ట్రం అభివృద్ధి దిశగా అడుగులు వేయాలంటే కూటమి ప్రభుత్వానికి మద్దతు తెలియజేయాల్సిన అవసరం ఉంది
ధి:13-2-2025 గురువారం మధ్యాహ్నం 12:00″గం లకు” విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని 63వ డివిజన్ రాధానగర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల నందు MLC ఎలక్షన్స్ లో ప్రథమ ప్రాధాన్యత ఓటు వేసి ఆలపాటి రాజేంద్రప్రసాద్ గారిని అఖండ మెజారిటీతో గెలిపించాలని ఉపాధ్యాయులకు ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు గారు అవగాహన కల్పించడం జరిగినది…
ఈ సందర్భంగా బొండా ఉమా గారు మాట్లాడుతూ :-ఉమ్మడి గుంటూరు-కృష్ణ జిల్లాల గ్రాడ్యుయేట్స్ కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి శ్రీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ గారిని గ్రాడ్యుయేట్స్ అందరూ అమూల్యమైన మొదటి ప్రాధాన్యత ఓటును ఆలపాటి రాజా గారికి ఓటును వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలి అని…
ఆలపాటి రాజేంద్రప్రసాద్ గారిని MLC గా గెలిపిస్తే ఈ రెండు ఉమ్మడి జిల్లాలు తో పాటు నవ్యాంధ్రప్రదేశ్ మొత్తం అభివృద్ధిలో ఈయన కూడా ఒక భాగస్వామ్యం చదువుకున్నటువంటి వారి గొంతును వినిపిస్తూ నిరుద్యోగ సమస్యను పరిష్కరించి యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు, విద్యార్థులకు విద్యావ్యవస్థను ప్రక్షాళన చేసి వారికి అవసరమైనటువంటి విధముగా ఉద్యోగులకు ప్రధానముగా ఉపాధ్యాయులకు అన్ని రకాల అయినటువంటి ప్రభుత్వ పరంగా అందవలసినటువంటి అభివృద్ధి సంక్షేమాన్ని అందించడంలో ప్రదానంగా అనుభవం కలిగినటువంటి వ్యక్తి అని అందుకని MLC గా రాజేంద్రప్రసాద్ ను గెలిపిస్తే పట్టభద్రులకు సంబంధించినటువంటి అన్ని సమస్యలను పరిష్కరిస్తారని ఫిబ్రవరి 27 ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ ఉంటుందన్నారు…
ఈ కార్యక్రమంలో:-అనంతపురం RTC రీజనల్ ఛైర్మెన్ పూల నాగరాజు, MLC అసెంబ్లీ కోఆర్డినేటర్ రామకృష్ణ , లబ్బా వైకుంఠం, బత్తుల కొండా, కోలా శ్రీను, మోదుగుల గణేష్, కాసిమ్, పైడి శ్రీను, పెద్ది శ్రీను, లబ్బా దుర్గ, దాసరి ఉదయశ్రీ, తదితరులు పాల్గొన్నారు…
