TEJA NEWS

నరసరావుపేటలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ “డిజిటల్ బుక్” ఆవిష్కరణ

నరసరావుపేట: పల్నాడు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ తరఫున “డిజిటల్ బుక్” ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి విడదల రజిని పాల్గొని మాట్లాడుతూ, వైసీపీ కార్యకర్తలు, నాయకులు ఎదుర్కొంటున్న అన్యాయాలు, వేధింపులు, కక్షలు, తప్పుడు కేసులకు సమాధానం చెప్పే పత్రికా ఆధారం ఈ డిజిటల్ బుక్ అని తెలిపారు.
“కూటమి ప్రభుత్వం పాలనలో మన కార్యకర్తలు ఎదుర్కొంటున్న అన్యాయాలకు సాక్ష్యం, సమాధానం ఇదే. మన నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కార్యకర్తలకు భరోసా, అభయం ఇచ్చే దిశగా ఈ డిజిటల్ బుక్ ప్రారంభించారు” అని రజిని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకరరావు, సత్తెనపల్లి ఇంచార్జ్ గజ్జల సుధీర్ భార్గవ్ రెడ్డి సహా పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.