నెల 18 నుంచి 10వ తరగతి పరీక్షలు షురూ

నెల 18 నుంచి 10వ తరగతి పరీక్షలు షురూ

TEJA NEWS

రాత ప‌రీక్ష‌కు 5.08 ల‌క్షల మంది విద్యార్ధులు

2676 ఎగ్జామ్ సెంట‌ర్స్

అయిదు నిమిషాలు గ్రేస్ టైమ్

నిమిషం నిబంధ‌న స‌డ‌లింపు

హైదరాబాద్:మార్చి 07
తెలంగాణలో పదో తరగతి పరీక్షల హాల్‌ టికెట్లు రేపు విడుదల కానున్నాయి.

ఈ నెల 18వ తేదీ నుంచి పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రింటెడ్ హాల్‌ టికెట్లను స్కూళ్లకు అధికా రులు పంపించారు. అలాగే స్కూళ్ల యాజమాన్యాలతో సంబంధం లేకుండా వెబ్‌సైట్‌ నుంచి విద్యార్థులు నేరుగా హాల్టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకునే అవకాశం కల్పించనున్నారు.

ఈ పరీక్షల కోసం 2,676 సెంటర్లను ఏర్పాటు చేయ గా.. 5.08 లక్షల మంది విద్యార్థులు హాజరవను న్నారు. పదోతరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహిం చేందుకు అధికా రులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

మార్చి 18 నుంచి ఏప్రిల్ 2 వరకు టెన్త్ పరీక్షలు జరగ నున్నాయి. మరోవైపు,18వ తేదీనే ఇంటర్ పరీక్షలు ముగియనున్నాయి.

ఇక టెన్త్ ప‌రీక్ష‌ల‌లోనూ నిమిషం నిబంధ‌న‌లో మార్పు చేశారు..గ్రేస్ పిరియ‌డ్ ను అయిదు నిమిషాల‌కు పెంచారు..

Print Friendly, PDF & Email

TEJA NEWS