సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో అర్హులకు వివిధ సంక్షేమ పధకాలు లభించేలా కృషి చేస్తామని సికింద్రాబాద్ శాసనసభ్యులు, మాజీ డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్ అన్నారు. సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి అడ్డగుట్ట, తార్నాక, మెట్టుగూడ, సితాఫలమండీ, బౌద్దనగర్ మునిసిపల్ డివిజన్లకు చెందిన సుమారు 155 మంది లబ్దిదారులకు షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి చెక్కులను పద్మారావు గౌడ్ మధురానగర్ కమ్యూనిటీ హాల్ లో అధికారులు, కార్పొరేటర్లు, వివిధ పార్టీల నేతలతో కలిసి అందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ లబ్దిదారులకు వీలైనంత తొందరగా వారికి లభించాల్సిన ప్రయోజనాలు అందించేలా అధికార యంత్రాంగం ఏర్పాట్లు జరపాలని పద్మారావు గౌడ్ సూచించారు. కార్పొరేటర్లు సామల హేమ, కంది శైలజ, రాసురి సునీత రమేష్, లింగాని ప్రసన్న లక్ష్మి శ్రీనివాస్, మరేడుప్పల్లి తాసిల్దార్ అశోక్, ముషీరాబాద్ తాసిల్దార్ గోవర్ధన్, నాయకులు పాల్గొన్నారు
అర్హులకు సంక్షేమ పధకాలు పద్మారావు గౌడ్
Related Posts
కొండకల్ గ్రామం లో అమ్మవారికి ప్రత్యేక పూజలు
TEJA NEWS కొండకల్ గ్రామం లో అమ్మవారికి ప్రత్యేక పూజలు శంకరపల్లి : దేవి నవరాత్రుల సందర్భంగా కొండకల్ గ్రామం లో అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్టింపజేసి బాల త్రిపుర సుందరి అవతారం లో ఉన్న అమ్మవారికి కొండకల్ దుర్గాభవాని కమిటీ ఆధ్వర్యం…
ఘనంగా మాజీ మంత్రి జువ్వాడి రత్నకర్ రావు జయంతి వేడుకలు
TEJA NEWS ఘనంగా మాజీ మంత్రి జువ్వాడి రత్నకర్ రావు జయంతి వేడుకలు దర్మపురి జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం స్థంభంపల్లి గ్రామంలో మాజీ ఉమ్మడి ఆంద్రాప్రదేష్ రాష్ట్ర దేవదాయ దర్మాదాయ శాఖా మంత్రి దివంగత నేత జువ్వాడి రత్నకర్ రావు…