TEJA NEWS

ఆషాడ మాసంలో అమ్మవారి బోనాల ఉత్సవాల సందర్భంగా ఊరేగించే ఘటానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది.. బోనాలకు ముందట వాడవాడలో ఈ ఘటాన్ని ఊరేగించి బోనాల రోజున ఈ ఘట ఊరేగింపు ముగింపు చేస్తారు…

మల్కాజ్గిరి ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఘట ఊరేగింపు కార్యక్రమం అంగరంగ వైభవంగా ఆలయ కమిటీ సభ్యులు ప్రారంభించారు..

అమ్మవారి ఘటం ఊరేగింపులో ప్రజలు భక్తులు ఎంతో ఉత్సాహంగా పాల్గొంన్నారు… అలాంటి సమయంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మల్కాజ్గిరి పోలీసు సిబ్బంది కట్టుదిట్టమైన భద్రత కల్పించారు..

ఆలయ కమిటీ సభ్యులు పోలీస్ సిబ్బందికి మరియు భక్తులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు…


TEJA NEWS