TEJA NEWS

అక్రిడేషన్ లేని విలేకరులకు, సంఘం సిఫారసులేకుండా ఇండ్ల స్థలాలు కేటాయించాలి

వనపర్తి.:
అక్రిడేష న్ కార్డు తో సంబంధం లేకుండా విలేకరుల సంఘాల సీ ఫా ర స్ లేకుండా వివిధ దిన పత్రికలలో ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేసే విలేకరుల అందరికీ ఇండ్ల స్థలాలు కేటాయించాలని . తెలంగాణ జన సమితి జిల్లా అధ్యక్షులు ఎం ఏ ఖాదర్ పాషా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ సెక్రటరీ రాష్ట్ర మంత్రివర్గం. తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం .ఎమ్మెల్యేలు ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ చిన్నారెడ్డి ఎమ్మెల్యే తుడి మేగారెడ్డి జిల్లా కలెక్టర్ లు స్పందించి వనపర్తి లో పనిచేసే విలేకరులందరికీ ఇండ్ల స్థలాలు ప్రభుత్వం కేటాయించి ఇల్లు నిర్మించుకోవడానికి 5 లక్షల ఉచితంగా ఇవ్వాలని ఆయన ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. నిరుపేద జర్నలిస్టులను ప్రభుత్వం గుర్తించి వారికి సొంత ఇండ్ల విషయంలో న్యాయం చేయాలని ఆయన కోరారు వనపర్తి పట్టణం సమీపంలో గతంలో శ్రీనివాసపూర్ శివారులో విలేకరులకు ప్రభుత్వం ద్వారా ఇండ్ల స్థలాలు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డ్ కేటాయించారని తె.లిపార్. అప్పుడు అన్ని అర్హతలు ఉన్న సీనియర్ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల పట్టాలు ఇవ్వకుండా అన్యాయానికి గురి చేశారని అయిన తెలిపారు . మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి పి .ఏ కొంతమంది విలేకరుల సంఘాల కమిటీ నాయకులతో వివరాలు సేకరించి ఇళ్ల పట్టాలు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మాజీమంత్రి నిరంజన్ రెడ్డి
పంపిణీ చేశారని అన్నారు . అప్పుడు కొంతమంది అక్రిడేషన్ ఉన్న విలేకరులకు ఇండిపెండెంట్ విలేకరులకు . అక్రిడేషన్ లేని సీనియర్ విలేకరులకు ఇళ్ల స్థలాలు కేటాయించకుండా మొండి చేయిచూపారని ఆవేదన వ్యక్తంచేశారు . అప్పట్లో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి పై వనపర్తి విలేకరులు కొంత వ్యతిరేకత లో ఉన్నార ని అన్నారు . ప్లాట్లు రాని విలేకరులు అప్పటి జిల్లా కలెక్టర్ తేజస్ నంద లాల్ పవార్ కు ఫిర్యాదు చేశారని తెలిపారు . మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి అప్పటికప్పుడు ప్లాట్లు రాని కొంతమంది విలేకరులకు
పట్టాలు ఇప్పించారని ఖాదర్ తెలిపారు .అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన తూడి మెగారెడ్డి అక్రిడేషన్ సంబంధం లేకుండా వనపర్తి లో విలేకరులందరికీ సొంతంగా స్థలం కొనుగోలు చేసి ఇండ్ల స్థలాలు కేటాయించి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రభుత్వం ద్వారా 5 లక్షలు ఉచితంగా ఇప్పించి ఇల్లు నిర్మించుకోవడానికి ఆదుకుంటామని అప్పట్లో కాంగ్రెస్ నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించి పత్రికా ప్రకటనలు ఇప్పించారని ఖాదర్ తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో వివిధ దినపత్రికల్లో ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేసే విలేకరుల అందర్నీ గుండెల్లో పెట్టుకుని ఇళ్ల స్థలాలు ఇల్లు నిర్మించుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారము లోకి )వచ్చిన వెంటనే న్యాయం చేస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చారని అయిన పేర్కొన్నారు . అధికారంలోకి రావడానికి ప్రజలు కాంగ్రెస్ పార్టీని గెలిపించారు . విలేకరులకు ఇండ్ల స్థలాలు చిన్న పత్రికలకు అక్రిడేషన్ కార్డు సంబంధం లేకుండా విలేకరులుగా దిన పత్రికలలో ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేసే విలేకరులందరికీ న్యాయం చేస్తానని హామీ ఇచ్చారని అదేవిధంగా హెల్త్ కార్డులు విలేకరుల కుటుంబ సభ్యులందరికీ అప్పట్లో టీ పీ సి సి అధ్యక్షులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని తెలిపారు . పక్క జిల్లా నాగర్ కర్నూల్ పట్టణంలో అక్రిడేషన్ కార్డు సంబంధం లేకుండా విలేకరుల సంఘాలకు సంబంధాలు లేకుండా విలేకరుల అందరికీ ఇళ్ల స్థలాల పట్టాలు ప్రభుత్వం పంపిణీ చేయించి ఆదుకున్నార ని అన్నారు . అప్పట్లో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పనిచేస్తున్న విలేకరులందరూ హర్షం వ్యక్తం చేశారని గుర్తు చేశారు . .వనపర్తి లో విలేకరుల అంద రికి విలేకరుల సంఘాల తో సంబంము లేకుండా విలేకరుల లు గా పని చేస్తునారా లేదా అని డీ. పీ ఆర్ ఓ ద్వార సమాచారం సేకరిoచి విలేకరులకు ఇండ్ల స్థలాలు కేటాయించి న్యాయం చేయాలని ఎమ్మెల్యే తూడి మెగా రెడ్డ రాష్ట్ర ప్లానిo గ్ బోర్డ్ వై స్ చైర్మన్ చిన్నారెడ్డి కలెక్టర్ కు ఖాదర్ విజ్ఞుప్తి చేశారు .


TEJA NEWS