ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మండలం అమానిగుడిపాడు గ్రామంలో ఈ నెల 1 నుండి ట్యాంకర్ల తోలకాన్ని నిలిపివేయడంతో ప్రజలు నీటి కోసం అల్లాడిపోతున్నారు. అమానిగుడిపాడు టీడీపీ నాయకులు చిట్యాల వెంగల్ రెడ్డి ఆధ్వర్యంలో వాటర్ ట్యాంకు లారీను ఏర్పాటు చేసి గ్రామ ప్రజలకు రోజుకి 2 ట్రిప్పులు చొప్పున కుంట నుండి నీటిని అమానిగుడిపాడు తోలుతున్నమన్నారు. దీంతో గ్రామస్తులు టీడీపీ నాయకులకు కృతజ్ఞతలు తెలియజేసారు.
![](https://tejanews.co.in/wp-content/uploads/2024/02/WhatsApp-Image-2024-02-08-at-17.44.58-1024x650.jpeg)