TEJA NEWS

జమ్మూకాశ్మీర్ ఎన్నికల ఇన్‌ఛార్జిలుగా కిషన్ రెడ్డి, రామ్ మాధవ్

జమ్మూకాశ్మీర్ ఎన్నికల ఇన్‌ఛార్జిలుగా కిషన్ రెడ్డి, రామ్ మాధవ్
త్వరలో జరగనున్న జమ్మూకాశ్మీర్ ఎన్నికల బీజేపీ ఇన్‌ఛార్జ్‌లుగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ నియమితులయ్యారు. దీనిపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ మంగళవారం ప్రకటన విడుదల చేశారు. ఇక జమ్మూకాశ్మీర్‌లో సెప్టెంబర్ 18, 25, అక్టోబర్ 1 తేదీల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల ఫలితాలు అక్టోబర్ 4న విడుదల అవుతాయి.


TEJA NEWS