TEJA NEWS

మేడారం వెళ్తున్న ఆర్టీసీ బస్సుకు ప్రమాదం.. పలువురికి గాయాలు

భూపాలపల్లి జిల్లా:ఫిబ్రవరి 21
కాటారం భూపాలపల్లి ప్రధాన రహదారిపై మేడిపల్లి శివారు అటవీ ప్రాంతంలో బుధవారం ఉదయం మంచిర్యాల డిపో నుంచి మేడారం వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సును ఎదురుగా వస్తున్న బొగ్గు లారీ ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్‌ తీవ్రంగా గాయపడ్డారు. ఆర్టీసీ డ్రైవర్‌తో పాటు పలువురికి స్వల్పంగా గాయాలయ్యాయి.

ప్రమాద సమయంలో ఆర్టీసీ బస్సులో 50 మంది ప్రయాణికులు ఉన్నారు. పెను ప్రమాదం తప్పడంతో అంతా ఊపిరిపీల్చు కున్నారు..


TEJA NEWS