ఘోర ప్రమాదం..బస్సు లారీ ఢీ..
కొండపాక మండలం రవీంద్రనగర్ లో రాజీవ్ రహదారిపై ఆర్టీసీ బస్సు లారీ ఢీకొన్నాయి. హైదరాబాద్ JBS నుంచి కరీంనగర్ డిపో 1కు చెందిన రాజధాని బస్సు కరీంనగర్ వెళ్తుండగా కొండపాక గ్రామం నుంచి లారీ ఒక్కసారిగా రోడ్డు మీదకు దూసుకువచ్చింది. దీంతో బస్సును లారీ బలంగా ఢీకొంది. దీంతో ఆర్టీసీ బస్సు డ్రైవర్ లక్ష్మయ్య, ప్రయాణికులకు మరో ఇద్దరికీ గాయాలయ్యాయి.
![](https://tejanews.co.in/wp-content/uploads/2024/04/WhatsApp-Image-2024-04-22-at-11.58.54-AM.jpeg)